AP Cabinet Meeting: సచివాలయంలో ఇవాళ (ఆగస్టు 6న) ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు.
దేవా కట్ట దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ వెబ్ సిరీస్ మయసభ ఆగస్టు 7న సోనీ లివ్ ద్వారా ప్రసారం కానుంది. ఈ సిరీస్లో నాయుడు – రెడ్డి పాత్రల స్నేహం, వారిద్దరి మధ్య నెలకొన్న రాజకీయ విరోధాలు కథా ప్రధానాంశమని ఇప్పటికే దాదాపు క్లారిటీ వచ్చేసింది. అయితే ఆ సమయంలో వారిద్దరూ కాంగ్రెస్లో కలిసి మంత్రులుగా సేవలందించిన కాలాన్ని ఈ సిరీస్ స్పృశించనుందన్న అంచనాలున్నాయి. ఇక్కడ పేర్లు ప్రస్తావించడం లేదు కానీ దాదాపుగా చంద్రబాబు రాజశేఖరరెడ్డి ఇద్దరి…
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పర్యటనలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒకటో తారీకు వస్తే పండగ వాతావరణం నెలకొంటుందని.. వైసీపీ పాలనలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేందుకు ఐదేళ్లు పట్టిందన్నారు. జగన్ పింఛన్లు పెంచుతామని ప్రజలను మోసం దగా చేశారని.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి విషమంగా ఉన్న పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నామని తెలిపారు. ఏడాది పాలనలో పెద్ద ఎత్తున అభివృద్ధి…
Ambati Rambabu Slams TDP:164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు జగన్ నామ జపం చేస్తున్నారని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.. తాజాగా అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీల ప్రక్రియ సంగతి మర్చిపోయి జగన్ కట్టడి కోసం పనిచేస్తున్నారని.. చిట్టి నాయుడు దెబ్బకు చంద్రబాబు బుర్ర కూడా పోయిందన్నారు.. జగన్ ను ఆపటం మీ తరం కాదు.. జగన్ వస్తే విపరీతంగా జనం వస్తున్నారని మీరే ప్రచారం…
Annadata Sukhibhava: కడప మహానాడులో హామీ ఇచ్చా త్వరలోనే రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అనుకున్న ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రారంభించాం. 2028 డిసెంబర్ కల్లా ఫేస్ వన్ స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు..
జమ్మలమడుగు అభివృద్ధిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. పేదల సేవలో తాను ఉండాలని సింగపూర్ కార్యక్రమాన్ని ముగించుకుని వచ్చినట్టు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 64 లక్షల మందికి 33 వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా పేదలకు ఇస్తున్నామని చెప్పారు.
YS Jagan Accuses CM Chandrababu of Revenge Politics: కాలేజ్ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పుతో కొట్టారని సీఎం చంద్రబాబు గుర్తు పెట్టుకున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కాలేజ్ రోజుల్లో అందరూ ఉడుకు రక్తం మీద ఉంటారని, అది గుర్తు పెట్టుకుని ఆయన కొడుకు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెట్టారని, చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గెలిచారని ఇదంతా…
తన పర్యటన సందర్భంగా నెల్లూరులో 2 వేల మంది పోలీసులు తిష్ట వేశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. వాళ్లంతా తన సెక్యూరిటీ కోసం కాదని, తన కోసం వచ్చే జనాల్ని అడ్డుకోవటానికిని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని, జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అడుగులకు పోలీసులు మడుగులు ఒత్తుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకులు తమ పార్టీ వారిని కలవటం నేరమా?,…
సీఎం చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్ట్ చేశారు కాబట్టి.. మాజీ సీఎం వైఎస్ జగన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతాన్ని తయారు చేసినట్లుగా జగన్ మీద విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో తన కొడుకుకు జగన్ అడ్డంకి లేకుండా చేయాలనే చంద్రబాబు తపనపడుతున్నారని పేర్కొన్నారు. మిగతా వారు అయితే మాట వింటారని.. జగన్ వినడు కాబట్టి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్…