Nara Lokesh: గల్లీ నాయకులం.. ఢిల్లీ నాయకులం కాదు..!
Nara Lokesh: టీడీపీ, బీజేపీ కూటమి బంధం బలంగా ఉందని.. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CPR)కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ 2025లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్డీఏలో చేరింది, అందుకు మద్దతు కొనసాగిస్తుంది. మేము ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్ముతాం. కాబట్టి, ఉపరాష్ట్రపతి ఎన్నికలైనా లేదా ఇతర ఎన్నికలైనా.. మా మద్దతు ఎన్డీఏ అభ్యర్థికే అని లోకేష్ అన్నారు. సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, సరైన నాయకత్వం అన్నింటికీ తేడా చూపిస్తుందని తాము నమ్ముతామని ఆయన చెప్పుకొచ్చారు.
ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తాను తన ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లి సీపీఆర్ను అభినందించామని లోకేష్ తెలిపారు. అయినప్పటికీ, ఇండియా కూటమి తరఫున సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించడం రాజకీయాలు అని ఆయన అన్నారు. మేము అలాంటి రాజకీయాలకు లొంగిపోమని లోకేష్ తేల్చి చెప్పారు. సుదర్శన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నప్పటికీ, తమ నినాదం “భారత్ ఫస్ట్” అని స్పష్టం చేశారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Gen Z protest in Nepal: ఖాట్మండులో రక్తపాతం.. 16 మంది మృతి, వందలాది మందికి గాయాలు!
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి ప్రస్తుతం మొత్తం ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ను నంబర్ 1 రాష్ట్రంగా మార్చడమే ఆయన ఎజెండా అని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో కూడా చెప్పామని.. మేము ‘గల్లీ నాయకులం’, ‘ఢిల్లీ నాయకులం’ కాదని ఆయన అన్నారు. మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఇక్కడ ఉన్నాం. ఈ పుకార్లన్నింటికి ఇక్కడితో ఫుల్స్టాప్ పెడదాం అంటూ పేర్కొన్నారు.
అలాగే భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు 2029లో జరుగుతాయని లోకేష్ గుర్తు చేశారు. 2029 తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏతోనే ఉంటుందని, తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. ఒక వ్యక్తి చాలా మార్పు తీసుకురాగలడని నేను నమ్ముతాను. చరిత్ర ఇది చూపించింది. సింగపూర్, మలేషియాను చూడండి.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అది చేసి చూపించారు. ప్రధాని మోడీ భారతదేశానికి అవసరమైన సరైన నాయకుడు, సరైన సమయంలో, సరైన చోట ఉన్నారు. మా మద్దతు ఎప్పటికి ఉంటుందని లోకేష్ పేర్కొన్నారు.
A Masterpiece: త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి, కలియుగానికి లింక్ పెడుతూ “ఎ మాస్టర్ పీస్”!
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!