Nara Lokesh: గల్లీ నాయకులం.. ఢిల్లీ నాయకులం కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: టీడీపీ, బీజేపీ కూటమి బంధం బలంగా ఉందని.. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CPR)కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ 2025లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్డీఏలో చేరింది, అందుకు మద్దతు కొనసాగిస్తుంది. మేము ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్ముతాం. కాబట్టి, ఉపరాష్ట్రపతి ఎన్నికలైనా లేదా ఇతర ఎన్నికలైనా.. మా మద్దతు ఎన్డీఏ అభ్యర్థికే అని లోకేష్ అన్నారు. సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, సరైన నాయకత్వం అన్నింటికీ తేడా చూపిస్తుందని తాము నమ్ముతామని ఆయన చెప్పుకొచ్చారు.
ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తాను తన ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లి సీపీఆర్ను అభినందించామని లోకేష్ తెలిపారు. అయినప్పటికీ, ఇండియా కూటమి తరఫున సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించడం రాజకీయాలు అని ఆయన అన్నారు. మేము అలాంటి రాజకీయాలకు లొంగిపోమని లోకేష్ తేల్చి చెప్పారు. సుదర్శన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నప్పటికీ, తమ నినాదం “భారత్ ఫస్ట్” అని స్పష్టం చేశారు.
Also Read
- Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
Gen Z protest in Nepal: ఖాట్మండులో రక్తపాతం.. 16 మంది మృతి, వందలాది మందికి గాయాలు!
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి ప్రస్తుతం మొత్తం ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ను నంబర్ 1 రాష్ట్రంగా మార్చడమే ఆయన ఎజెండా అని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో కూడా చెప్పామని.. మేము ‘గల్లీ నాయకులం’, ‘ఢిల్లీ నాయకులం’ కాదని ఆయన అన్నారు. మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఇక్కడ ఉన్నాం. ఈ పుకార్లన్నింటికి ఇక్కడితో ఫుల్స్టాప్ పెడదాం అంటూ పేర్కొన్నారు.
అలాగే భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు 2029లో జరుగుతాయని లోకేష్ గుర్తు చేశారు. 2029 తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏతోనే ఉంటుందని, తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. ఒక వ్యక్తి చాలా మార్పు తీసుకురాగలడని నేను నమ్ముతాను. చరిత్ర ఇది చూపించింది. సింగపూర్, మలేషియాను చూడండి.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అది చేసి చూపించారు. ప్రధాని మోడీ భారతదేశానికి అవసరమైన సరైన నాయకుడు, సరైన సమయంలో, సరైన చోట ఉన్నారు. మా మద్దతు ఎప్పటికి ఉంటుందని లోకేష్ పేర్కొన్నారు.
A Masterpiece: త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి, కలియుగానికి లింక్ పెడుతూ “ఎ మాస్టర్ పీస్”!
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?