Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Botsa Satyanarayana Slams Chandrababu Govt Rs 2 Lakh Crore Debt But No Rs 6000 Crore For Healthcare

Botsa Satyanarayana: 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం.. ప్రజారోగ్యం కోసం 6 వేల కోట్లు ఖర్చు చేయదా?

Published Date :September 7, 2025 , 12:36 pm
By Sampath Kumar
  • వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవు
  • చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ జీతగాడని ప్రచారం
  • పేదలకు వైద్యం అందడం లేదు
  • ప్రజారోగ్యంపై దుష్ట చర్యలు చేయడం కరెక్ట్ కాదు
Botsa Satyanarayana: 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం.. ప్రజారోగ్యం కోసం 6 వేల కోట్లు ఖర్చు చేయదా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు నిధులు విడుదల కాని కారణంగా పేదలకు వైద్యం అందడం లేదన్నారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం 6 వేల కోట్లు ఖర్చు చేయదా? అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేట్ విధానంపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరారు. యూరియా కోసం అడిగితే సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని, ప్రభుత్వం అవినీతి కారణంగానే యూరియా కొరత వచ్చిందని బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు.

‘వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవు. దోపిడీ, స్వార్ధం, సొంతం కోసం ప్రైవేట్ పరం చేయాలని చూడటం దారుణం. సీఎం చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ జీతగాడని ఉన్న ప్రచారం గుర్తు చేసుకోవాలి. పులివెందుల వంటి కాలేజీలో అడ్మిషన్లకు మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చినా వద్దని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంది. మెడికల్ కాలేజీలపై గత ప్రభుత్వం రెండు వేల కోట్లు ఖర్చుపెట్టింది. కోవిడ్ కారణంగా పనులు ఆలస్యం అయ్యాయి. ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు నిధులు విడుదల కాని కారణంగా పేదలకు వైద్యం అందడం లేదు. రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం 6 వేల కోట్లు ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయలేరా?. కమిషన్ల కోసం ఆసుపత్రులను ఇబ్బందులు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు హర్షించరు. జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే వేరే విధంగా తీర్చుకోండి. అంతేతప్ప ప్రజారోగ్యంపై దుష్ట చర్యలు చేయడం కరెక్ట్ కాదు. మెడికల్ కాలేజీల ప్రైవేట్ విధానం పునఃసమీక్షించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని బొత్స సత్యనారాయణ చెప్పారు.

Also Read

  • Vijay TVK Government: టీవీకే విజయ్‌కి కాంగ్రెస్ షరతులు.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక మలుపు!
  • Kolkata: కోల్‌కతాలో బుల్డోజర్ల గర్జన.. అర్ధరాత్రి టీఎంసీ ఆఫీసు నేలమట్టం!
  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే...
  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

‘యూరియా కోసం అడిగితే సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, సమస్య ఎందుకు ఉత్పన్నమైందనే విశ్లేషణ ఎందుకు చేయడం లేదు. ప్రభుత్వం అవినీతి కారణంగానే యూరియా కొరత వచ్చింది. రికార్డుల అధారంగా నిరూపిస్తాం రండి. ఏసీ రూముల్లో కూర్చుని సన్నాయి నొక్కులు, ఏసీ రూముల్లో కూర్చుని కబుర్లు చెబితే సరిపోదు. యూరియా కోసం రైతుల పడుతున్న బాధలను మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. యూరియా కొరతపై మేం మొదటి నుంచి చెబుతున్నాం. రైతు చేయి ఎప్పుడూ పైనే ఉండాలనేది మా ప్రభుత్వం నమ్మింది. అందుకే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆన్ టైంలో ఇచ్చాం. అన్నీ బ్యాక్ డోర్ విధానాలనే ప్రభుత్వం అవలంబిస్తోంది. 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తో కలిసి ఆర్డీఓలకు వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వస్తాం’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Also Read: Chinta Mohan: వాట్సప్ పరిపాలన అంటూ.. చంద్రబాబు వాటాల పరిపాలన చేస్తున్నారు!

‘మాట్లాడితే జైల్లో పెడతాం అంటే ఇవాళ పోతే రేపు రాదా. అధికారంలో ఉన్న వాళ్లకు భాష మీద పట్టుండాలి. రుషికొండ మీద పెచ్చు ఊడిందో.. ఊడ గొట్టారో అనే అంశాల జోలికి నేను వెళ్ళను. ఊడిపోయి ఉంటే నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రుషికొండ కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించింది ఈ ప్రభుత్వమే. రుషికొండ రిసార్ట్స్ ను ఏం చేయాలో తెలియడం లేదంటున్నారు. రెవెన్యూ రావడం లేదన్నప్పుడు టూరిజం కేంద్రం కనుక పబ్లిక్ ఆక్షన్ చేయవచ్చు కదా, ఇది నా ఉచిత సలహా. ఈ ఏడాదిన్నరలో ప్రైవేట్ హోటళ్లకు ఎంత కట్టారో చూడండి. భూముల్ని నామమాత్రం ధరలకు కేటాయించినప్పుడు రుషికొండ మీద ఎందుకు తాత్సారం. బీజేపీ పాలిత రాష్ట్రాలలో లేని యూరియా సమస్య ఏపీలో ఎందుకు వస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు యూరియా డైవర్ట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉన్న ఏపీ రైతులు ఏం పాపం చేశారని ఇబ్బందులు పెడుతున్నారు. మెడికల్ కాలేజీలను ఎవరికి కేటాయించాలో ముందుగానే నిర్ణయించుకుని ప్రైవేట్ పరం చేస్తున్నారు. త్వరలో వాళ్ళ పేర్లన్నీ బయటపెడతాను’ అని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aarogyasri
  • botsa satyanarayana
  • Chandrababu Naidu
  • tdp
  • ycp

తాజావార్తలు

  • Vijay TVK Government: టీవీకే విజయ్‌కి కాంగ్రెస్ షరతులు.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక మలుపు!

  • Theaters: తెలుగు రాష్ట్రాల్లో మూతపడుతున్న థియేటర్లు..

  • Kalita Majhi: ఇళ్లలో పనిమనిషి నుండి ఎమ్మెల్యేగా ఎదిగిన కలితా మాజీ.. ఈమె ఎవరు?

  • Kolkata: కోల్‌కతాలో బుల్డోజర్ల గర్జన.. అర్ధరాత్రి టీఎంసీ ఆఫీసు నేలమట్టం!

  • Salman Khan: సల్మాన్ ఖాన్ ‘SVC63’లో పవర్‌ఫుల్ విలన్..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions