CPS Employees: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 1న లక్ష మంది ఉద్యోగులతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. శాతవాహన కాలేజీ గ్రౌండ్స్లో బహిరంగ సభ నిర్వహణకు, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్లలో ఏదో ఒక చోట ర్యాలీకి అనుమతి ఇవ్వాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దు అంశంపై…
ఏపీలో మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ కార్మికులు నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సోమవారం సెలవును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎల్పీవో, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులకు సెలవు మంజూరు చేయవద్దని కలెక్టర్లు ఆయా శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి స్కానింగ్ ప్రతులను ఉ.10:45 గంటల్లోగా ఉన్నతాధికారులకు పంపించాలని, హెడ్క్వార్టర్లు విడిచిపెట్టి వెళ్లరాదని ఆదేశించారు. మరోవైపు…
ఏపీలో హాట్ టాపిక్ గా మారింది పీఆర్సీ అంశం. దీనిపై మంత్రుల కమిటీ భేటీ అయింది. పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసిందన్నారు సలహాదారు సజ్జల. ఉద్యోగ సంఘాల అనుమానాలు నివృత్తితో పాటు కొన్ని సర్దుబాటు చేశాం. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఉన్నా ఉదారంగానే ఉద్యోగుల కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు సజ్జల. చాలా అంశాల్లో ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయని భావిస్తున్నాం అన్నారు. మళ్ళీ కలిసి పనీ చేస్తాం అన్న…
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ ఉద్యమం ఉధృతం రూపం దాల్చింది.. ఇవాళ నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడంతో.. వారిలో మరింత పట్టుదల పెరిగింది.. రేపు సమావేశమై… భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధం అయ్యారు.. ఇదే సమయంలో సమ్మెకు సిద్ధం అవుతున్నారు.. ఇక, ఉద్యోగులకు క్రమంగా మద్దతు పెరుగుతోంది.. ఇవాళ ఉద్యోగుల ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఆ కష్టాలు తనకు తెలుసునని.. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని ఇన్నాళ్లు…
పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన ఉద్యోగులు.. ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించారు.. విజయవాడలోని రోడ్లు.. ఉద్యోగులతో కిక్కిరిసిపోయాయి.. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. ఉద్యోగుల కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోయారు.. పెద్ద ఎత్తున అరెస్ట్ లు, నిర్బంధాలు కూడా వారిని ఆపలేకపోయాయి.. ఇక, ఛలో విజయవాడపై స్పందించిన స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాసరావు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఛలో విజయవాడకు లక్షలాదిగా ఉద్యోగులు తరలివచ్చారని తెలిపారు.. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఛలో విజయవాడను…
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ వ్యవహారం రచ్చరచ్చగా మారిపోయింది.. ఆందోళనలో భాగంగా ఇవాళ ఛలో విజయవాడ నిర్వహించారు ఉద్యోగులు.. అయితే, ఉద్యోగుల ఆందోళనను ప్రభుత్వం తప్పుబడుతోంది.. ప్రభుత్వం ముందు నుంచి చర్చలకు సిద్ధం అని చెబుతూనే ఉన్నామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇటువంటి ఆందోళన వల్ల బహిరంగ ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది తప్ప ఉపయోగం ఉండదన్న ఆయన.. ఛలో విజయవాడ బల ప్రదర్శన చేయటం వంటిదే అని వ్యాఖ్యయానించారు.. కోవిడ్ పరిస్థితుల నుంచి పూర్తిగా కోలుకోలేదు.. ఉన్న పరిస్థితుల్లో…
పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నా.. నిర్బంధించినా.. ఛలో విజయవాడ విజయవంతం అయ్యిందని చెబుతున్నాయి ఉద్యోగ సంఘాలు.. ఇక, ఛలో విజయవాడపై స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మాట్లాడుతూ.. ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం సక్సెస్.. ఇది సీఎం జగన్ నియంతృత్వానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.. ఉద్యోగులు కొత్తవి ఏమీ కోరడం లేదన్నారు.. పీఆర్సీ అమలు సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారితో చర్చలు జరపడం ఆనవాయితీ.. కానీ, పీఆర్సీ నివేదికను ఉద్యోగులకు సీఎం జగన్ ఎందుకు ఇవ్వడం…
ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ఉద్యమం ఉధృతం అవుతోంది.. ఇవాళ ఛలో విజయవాడ ఉద్రిక్తతలకు దారి తీసింది.. అయితే, ఉద్యోగుల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని.. అందుకే ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులేనని స్పష్టం చేసిన ఆయన.. చర్చలతోనే ఉద్యోగుల సమస్య పరిష్కారమవుతుందన్నారు.. కానీ, ఉద్యోగుల వెనుక చంద్రబాబు ఉన్నారు.. ఉద్యోగుల వెనుక ఆయన ఉన్నారు కాబట్టే.. సంఘాల నేతలు ఈ స్థాయిలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం కనుచూపు మేర ఉద్యోగులతో నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద స్థాయిలో ఏ ఉద్యమంలోనూ ఇంతమంది పాల్గొన్న దాఖలాలు లేవు. పోలీసులు జిల్లాల్లోనే కొందరు ఉద్యోగులను అడ్డుకున్నా.. మారు వేషాల్లో చలో విజయవాడకు ఉద్యోగులు తరలివచ్చారు. రైతులు, కూలీల వేషంలో ఉద్యోగులు విజయవాడ చేరుకున్నట్టు అనేక…