ఛలో విజయవాడ సక్సెస్.. జగన్ నియంతృత్వానికి చెంపపెట్టు..!
పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నా.. నిర్బంధించినా.. ఛలో విజయవాడ విజయవంతం అయ్యిందని చెబుతున్నాయి ఉద్యోగ సంఘాలు.. ఇక, ఛలో విజయవాడపై స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మాట్లాడుతూ.. ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం సక్సెస్.. ఇది సీఎం జగన్ నియంతృత్వానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.. ఉద్యోగులు కొత్తవి ఏమీ కోరడం లేదన్నారు.. పీఆర్సీ అమలు సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారితో చర్చలు జరపడం ఆనవాయితీ.. కానీ, పీఆర్సీ నివేదికను ఉద్యోగులకు సీఎం జగన్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు రామకృష్ణ.. సీఎం వైఎస్ జగన్ ఏమన్నా పైనుంచి ఊడి పడ్డారా? అంటూ ఫైర్ అయిన ఆయన.. జగన్ సీఎంగా ఉండగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు..
Read Also: ఉద్యోగుల వెనుక చంద్రబాబు ఉన్నారు… అందుకే ఆ మాటలు..!
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఇక, సమస్య పరిష్కారం చేయమంటే జగన్ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారంటూ ఆరోపించిన రామకృష్ణ.. జిల్లాల విభజన సమాచారాన్ని మంత్రలకు ఆన్ లైన్ లో పంపి సీఎం ఆమోదం తెలిపారు.. రానున్న రోజుల్లో జగన్ ఆన్ లైన్ లోనే భోజనం చేస్తాడేమో అంటూ ఎద్దేవా చేశారు.. ఉద్యోగుల సమస్యలపై జగన్ నేరుగా జోక్యం చేసుకోవాలి.. లేకపోతే ఉద్యోగులు జగన్ ను ఇడుపులపాయ ఇంటికి పంపిస్తారని హెచ్చరించిన ఆయన.. ఉద్యోగులు శాంతియుతంగా ర్యాలీ చేస్తే అరెస్టులు చేయడం ఏమిటి? అని నిలదీశారు. జిల్లాల విభజనపై ఫిబ్రవరి ఎనిమిదో తేదీన విజయవాడలో సిపిఐ కార్యవర్గ సమావేశంలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అన్నారు రామకృష్ణ.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో