పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తుండగా.. ఇప్పుడు నిర్మాణ రంగంపై కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సిమెంట్ ధరలు పెరుగుతాయా? అన్న చర్చ జరుగుతుండగానే.. సిమెంట్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నాన్-ట్రేడ్ కస్టమర్లకు సిమెంట్ ధరలను ఏకంగా రూ.50 వరకు పెంచాయి. దీంతో ప్రస్తుతం 280 నుంచి 320 రూపాయల వరకు ఉన్నా.. తర్వాత 370 వరకు పెరగనుంది. కొన్నిచోట్ల 420 రూపాయల వరకు కూడా పెరుగుతుంది. సిమెంట్ కంపెనీల…
Cement Prices: సిమెంట్ ధరలు 5 ఏళ్ల కనిష్టానికి పడిపోయినట్లు యెస్ సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది. ఈ సెక్టార్లో తీవ్రమైన పోటీ కారణంగా సిమెంట్ ధరలు కనిష్టానికి పడిపోయినట్లుగా చెప్పాయి. ఇటీవల త్రైమాసికాల్లో ధరలు పెంచడానికి ప్రయత్నించినప్పటికీ, ఈ పెరుగుదలపై వెనక్కి తగ్గాయని నివేదిక పేర్కొంది. బలహీనమైన మార్కెట్ పరిణామాలు, డిమాండ్ని తగ్గించాయని వెల్లడించింది.