Breaking News: పశ్చిమాసియా పరిణామాలు, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆదివారం రాత్రి అత్యున్నత సమావేశం జరగబోతోంది. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశం కానుంది. తమిళనాడు పర్యటన తర్వాత ఆదివారం రాత్రి మోడీ ఢిల్లీకి చేరుకున్న తర్వాత సేవాతీర్థ్లో ఈ సమావేశంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు, గల్ఫ్ దేశాల్లోని భారతీయుల రక్షణ గురించి చర్చించే అవకాశం ఉంది.
ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు, ఆర్థిక ఆంక్షలు, తదుపరి సైనిక చర్యలకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది.