ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడ ‘జల్లికట్టు’ అని, ఎద్దుల బండ్ల పందేలను అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.