Free Sand : ఏపీలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం
- రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఉచిత ఇసుక విధానం
- సుక పాలసీ అమలులోకి రావడంతో హర్ష వ్యక్తం చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఇసుకను ఉచితంగా సరఫరా చేసేందుకు వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏలూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి తదితర జిల్లాల కలెక్టర్లు ఉచిత ఇసుక సరఫరా ఏర్పాట్లపై సమీక్షించారు, స్టాక్ పాయింట్లలో తగినంత ఇసుక ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గనులు, భూగర్భ శాస్త్రం, రవాణా, రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బంది నదులు, కాలువల వెంట ఉన్న స్టాక్ పాయింట్లను సందర్శించి స్టాక్ పొజిషన్పై ఆరా తీశారు. ఏలూరు కలెక్టర్ కె.వెట్రి సెల్వి ఉంగుటూరు మండలం చేబ్రోలులోని స్టాక్ పాయింట్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం కుకునూరు మండలం వింజరం గ్రామంలోని స్టాక్ పాయింట్ను జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి పరిశీలించారు. ఏలూరు జిల్లాలోని రుద్రమకోట, దాచారం, వింజరం, ఇబ్రహీంపట్నం, చేబ్రోలు స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను సరఫరా చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు.
“రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉచిత ఇసుక విధానం అమలు చేయబడుతుంది. ఒక వ్యక్తికి రోజుకు 20 టన్నుల ఇసుక ఇవ్వనున్నారు. వినియోగదారుల నుంచి సెగ్నియారేజీ, జీఎస్టీ మాత్రమే వసూలు చేస్తారు’’ అని అధికారులు తెలిపారు. స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. సృజన అధికారులను ఆదేశించారు , తహశీల్దార్లు , రెవెన్యూ , గనులు , భూగర్భ శాఖల అధికారులు ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక సరఫరా అవుతుందని, తహశీల్దార్లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తూ సరఫరాను పర్యవేక్షించాలన్నారు. స్టాక్ పాయింట్ల వద్ద ధరలు, స్టాక్ లభ్యతతో కూడిన బోర్డులను ప్రదర్శించాలని అధికారులు తెలిపారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఏలూరు జిల్లాలో రెండు స్టాక్ పాయింట్ల ద్వారా ఉచిత ఇసుక పంపిణీకి ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉంగుటూరు మండలం చేబ్రోలు, కుక్కునూరు మండలం వింజరం , ఇబ్రహీంపేట స్టాక్ పాయింట్లు నుంచి ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐతే కొద్ది మొత్తంలో మాత్రమే అందుబాటులో ఇసుక ఉండడంతో స్టాకు మరింత పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. గోదావరి వరద ఉధృతి పెరగడంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు.ఉచిత ఇసుక పాలసీ అమలులోకి రావడంతో భవన నిర్మాణ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!