నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఖాట్మండ్కు వెళ్తున్న బస్సు ధాడింగ్ దగ్గర నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా 18 మంది చనిపోయారు. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.