రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న రేవంత్ పై సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేసారని, పెట్టబడులకు తెలంగాణను స్వర్గంగా మార్చుతున్నారన్నారు. రేవంత్ అమెరికా పర్యటన విజయవంతం కావడం బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని, సూటు బూటు వేసుకొని దావొస్ వెళ్లిన కేటీఆర్ ఎన్ని కంపెనీలను తెలంగాణకి తెచ్చారన్నారు ఆది శ్రీనివాస్. కేటీఆర్ ఏంవోయూ కుదుర్చుకున్న…
కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రలో బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. నెహ్రూ అమలు చేసిన బానిసత్వ మరకలను తుడిచివేయాలని, అంబేద్కర్ గొప్ప రాజ్యాంగం అందిస్తే… రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ అనేక పాపాలను యాడ్ చేసిందని ఆయన మండిపడ్డారు. మైనారిటీ సంతూష్టీకరణ విధానాలే దేశ అనిశ్చితికి కారణమని ఆయన ధ్వజమెత్తారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందిస్తే… అందులో కాంగ్రెస్ అనేక పాపాలను జత చేసిందని…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కోరారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్ లోని తమ నివాసంలో కిషన్ రెడ్డి దంపతులు జాతీయ జెండాను ఎగురవేశారు. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా జరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. Mamata Banerjee: ట్రైనీ డాక్టర్పై అత్యాచారం-హత్య కేసును వేగంగా ఛేదించాలి..…
దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతాలు, ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే.. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు…
‘అగ్నిపథ్’ మంచి పథకమని పేర్కొంటూ ప్రతిపక్షాలు విద్యార్థుల్లో గందరగోళం సృష్టించి విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ మైలేజీ పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఆరోపించారు. పథకంలో ఏదైనా సమస్య ఉంటే సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాల కుట్రలో ఇరుక్కుని విద్యార్థులు నిర్ణయాత్మకంగా ఉండవద్దని సూచించారు. ఆదివారం ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ నుండి ప్రాతినిధ్యాన్ని స్వీకరించిన కేంద్ర మంత్రి…
సనత్ నగర్ అసెంబ్లీ బన్సీలాల్ పేట, న్యూ బోయి గూడలో జరిగిన బోనాల పండుగ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా బన్సీ లాల్ పేట్ చాచా నెహ్రు నగర్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని సి-క్లాస్ బన్సీలాల్పేట – శ్రీ బండ మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. తర్వాత బన్సీలాల్ పేట శ్రీ రేణుకా ఎల్లమ్మ, శ్రీ నల్ల పోచమ్మ ముత్యాలమ్మ బోనాల…
జై గౌడ్ ఉద్యమం కమిటీ ఆధ్వర్యంలో 374వ సర్దార్ పాపన్న మహారాజ్ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సేఫ్టీ మోపులు ఇవ్వబోతున్నామని, ప్రభుత్వ.. అసైన్డ్ భూముల్లో యాభై శాతం తాటి.. ఈత.. కర్జూరా మొక్కలను పెంచాలని సీఎం…
రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని వివేకానంద గౌడ్ విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంత షాడో మంత్రుల దందా నడుస్తుందని, కోవర్టు రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. సుంకిశాల ప్రమాదం పై బీఆర్ఎస్ పార్టీ పలు ప్రశ్నలను ప్రభుత్వం ముందు ఉంచిందని, సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిన ఘటనలో ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు. నిర్మాణం సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశామన్నారు వివేకానంద. ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత సోషల్…
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 229 మందికి 56 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణకి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని, రెండు పార్టీలకు చెరో 8 ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణకి మోసం చేశాయన్నారు. బీజేపీకి 8 సీట్లు ఇస్తే తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని, బీజేపీకి ఆంధ్రా తీపి అయింది… తెలంగాణ చేదు అయ్యిందా..? అని…
సంగారెడ్డిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, BJYM జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లి కేటీఆర్ తో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాడేమో..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మొదటినుంచి తోడు దొంగల పార్టీ..నాణానికి బొమ్మ బొరుసు ఈ పార్టీలు అని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, మెడిగడ్డ,…