విజయవాడలో మళ్లీ వర్షం మొదలైంది. ఇప్పటికే బుడమేరు వరద ముంపుతో విజయవాడలోని పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతుండటంతో ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఇంకా జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, అంబాపురం, సింగ్ నగర్లో ఇంకా వరద నీరు నిలిచి ఉంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. అయితే వర్షం కురుస్తున్నప్పటికీ వరద బాతులకు సహాయ కార్యక్రమాల్లో ఇటువంటి ఆటంకాలు ఉండకూడదని, వారికి అవసరమైన…
నేడు శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ పర్యటించనున్నారు. గురుపూజోత్సవంలో రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. అయితే.. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 5 గురువారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం మళ్లీ ఏర్పడే అవకాశం ఉన్నందున, ఈ వారంలో ఆంధ్రప్రదేశ్కు మరో తడి వాతావరణం ఎదురుకావచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. “ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర లో నేటి నుంచి 8వ తేదీ వరకు, దక్షిణ కోస్తా లో ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు వానలు ఏకధాటిగా…
ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేని విధంగా కుండపోత వర్షాలు , వరదల కారణంగా వారి సంఖ్య 32కి పెరిగిందని, సహాయక శిబిరాల్లో ఉన్న వారి సంఖ్య 45,369కి పెరిగిందని అధికారులు తెలిపారు. విజయవాడలో అత్యధికంగా ప్రభావితమైన ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది మరణించారు; గుంటూరు (ఏడు), పల్నాడు (ఒకటి) అధికారికంగా విడుదలయ్యాయి. వరద బీభత్సానికి గురైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలను గురువారం కేంద్ర ప్రభుత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖల బృందం సందర్శించి బాధితులతో సంభాషించనుంది. కేంద్ర బృందంలో…
ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన కాలువలలో ఒకటైన బుడమేరు విజయవాడలోని అనేక నివాస ప్రాంతాలను వరదలు ముంచెత్తడం, ముంపునకు గురికావడంతో రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. సింగ్ నగర్, పాయకాపురం, వైఎస్ఆర్ కాలనీ తదితర ప్రాంతాలు ముంపునకు గురికావడానికి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అయితే.. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద నుంచి తేరుకుంటున్నారు బెజవాడ ప్రజలు. అయితే.. 80 శాతం ప్రాంతంలో నీరు తగ్గుముఖం పట్టింది. సహాయ చర్యలు ఊపందుకుంటున్నాయి. Happy Teachers Day…
Sukanya Samriddhi Yojana: భారతదేశంలోని అమ్మాయిల భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను అందించడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సుకన్య సమృద్ధి యోజనలో ఓ పెద్ద మార్పు చేయబడింది. ఈ పథకంలో, కుమార్తె చదువు లేదా పెళ్లికి డబ్బును పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పుడు తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు మాత్రమే కుమార్తె ఖాతాను నిర్వహించగలరు. ఇది జరగకపోతే ఆ ఖాతాను మూసివేయబడుతుంది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ రూల్ మార్పు గురించి వివరంగా తెలుసుకుందాం..…
తెలంగాణలో భారీగా వచ్చిన వరదలు వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టపోయామని అయితే తమను ఆదుకోవాలని కనీసం 2000 కోట్ల రూపాయలైనా సరే ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఇప్పటివరకు స్పందించ లేదని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు .తెలంగాణలో జరిగిన నష్టం అంచనా వివరాలను కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా వివరించామని అయితే కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎటువంటి హామీ లభించలేదని పొంగులేటి అంటున్నారు. ఖమ్మం పర్యటనలో టిఆర్ఎస్ నేతలకి ప్రజల నుంచే తిరస్కారం…
మూడు రోజుల పాటు ఏక దాటినా వచ్చిన వర్షాలకి పాలేరు రిజర్వాయర్ నుంచి భారీ ఎత్తున వరద వచ్చింది. పాలేరు రిజర్వాయర్ సామర్ధ్యాన్ని మించి వరదలు వచ్చాయి రిజర్వాయర్లో 21 అడుగుల సామర్థ్యం ఉంటే దాదాపుగా 39 అడుగుల సామర్థ్యం స్థాయి వరద పాలేరుకు వచ్చింది సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీరు పాలేరు రిజర్వాయర్ కి రావటంతో దాని ప్రభావం కాలువల మీద పడింది. వరద కూడా సాగర్ కాలువల మీద పడింది. దీంతో పాలేరు…
ఖమ్మం కార్పొరేషన్ కార్యాలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. వరద ఉధృతి తగ్గుముఖం పట్టినా వెంటనే పూర్తి స్థాయి సహాయ పనులు మొదలు పెట్టామని, శానిటేషన్ వరంగల్ హైదారాబాద్ నుండి కార్మికులు వచ్చారన్నారు మంత్రి తుమ్మల. విద్యుత్ సరఫరా ఇచ్చాము, భోజనాలు అందిస్తున్నామని, నిత్యావసర వస్తువులు, సరుకులు పంపిణీ జరుగుతుందని ఆయన అన్నారు. ఫైర్ ఇంజన్ అందుబాటులో తెపించామని, రోడ్ల పై ఇండ్ల పై…
కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద వెంటనే తెలంగాణకు పాకేజ్ ని విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తెలంగాణలో పర్యటించి వాస్తవాలను జరిగిన నష్టాన్ని తెలుసుకోవాలని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతుండు అని ఆయన మండిపడ్డారు. వానలు వచ్చినా, వరదలు వచ్చినా కేటీఆర్ కు పట్టదని, యువరాజు కేటీఆర్, ఎలెన్ మాస్క్ x ప్లాట్ ఫామ్ మీద…
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా హరీష్ రావుకి నచ్చట్లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండీ భవిషత్తును దృష్టిలో పెట్టుకొని ఏ మంచి కార్యక్రమం చేయలేదన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ లో 90 శాతం చెరువులను కబ్జా చేసింది బీఆర్ఎస్ నాయకులే అని, నేను ప్రూవ్ చేయడానికి సిద్ధమన్నారు ఆయన. ఆ పాపం అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు దే…