బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్ వ్యాఖ్యలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బాల్కసుమన్ వ్యాఖ్యలను జనం ఈసడించుకున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో మాట్లాడారు.. దాంతో ప్రజలు సరియైన గుణపాఠం చెప్పారు.అయినా బుద్దిరాలేదని, ఒళ్లు దగ్గర పెట్టుకోండి..సరిగా మాట్లాడండీ అని ఆయన హితవు పలికారు.…
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలై పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ఇవాళ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సన్నాసులు పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు పండబెట్టి తొక్కుతారన్నారు. 4 కోట్ల మంది చెప్పుతో కొట్టినా బుద్దిరాలేదని, చెప్పులతోని కొట్టిన గాని బీఆర్ఎస్ వాళ్ళకి బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు. రెండు నెలలకే తట్టుకోలేని పరిస్థితి వచ్చింది మీకు అని, ఫ్రస్టేషన్లో ఏది…
దక్షిణ తెలంగాణకు, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అన్యాయం చేసింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. SLBC ప్రాజెక్ట్ ను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువు ఛాయాలకు కేసీఆర్ కారణమన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హాంతకుడికి, పనికిరాని వ్యక్తి జగదీష్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని ఆయన మండిపడ్డారు. మంత్రి జగదీష్ రెడ్డి…
సీఎం రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఖాళీ అయ్యి పెంక కుండలు ఉన్నాయని అంటున్నారని అన్నారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 13 వేల కోట్ల బడ్జెట్ తో మోడీ విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టారని, ఎన్నికల కారణంగా అమలు కాస్త ఆలస్యమైందని ఆయన తెలిపారు. అయినా ఇప్పటి వరకు 1.20 లక్షల మందిని విశ్వకర్మ యోజనలో చేర్పించామని ఆయన పేర్కొన్నారు. కానీ దీనికి సంబంధించి ఎంపిక చేయాల్సిన బాధ్యత రాష్ట్ర…
తాంసి మండలం చర్లపల్లి గ్రామం వద్ద సోమవారం టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో కండక్టర్తో సహా ఐదుగురికి గాయాలయ్యాయి. గ్రామ సమీపంలోని వంపు వద్ద వాహనం తాబేలు కావడంతో ముగ్గురు ప్రయాణికులు, బస్సు కండక్టర్కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వంపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప…
రేవంత్ రెడ్డి మితి మీరిన అహంకారంతో మాట్లాడారని, వితండ వాదం చేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీచమైన పద్ధతి లో కేసీఅర్ పై వ్యక్తిగత దూషణలు చేశారు రేవంత్ అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం మేము KRMBకి ప్రాజెక్ట్ లు అప్పజెప్పామని రంకెలు వేస్తుందని, KRMB మీటింగ్ లో ప్రాజెక్ట్ లు అప్పగించేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందన్నారు హరీష్ రావు. రెండు…
బీసీల జీవిత కాల వాంఛ అయిన కుల గణనకు ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్కి ధన్యవాదాలు తెలిపారు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మేమెంతో మాకంత అన్న నినాదాన్ని నిజం చేయడంలో కుల గణన తొలి అడుగు అని ఆయన అన్నారు. తొలి అడుగుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్కకి, తెలంగాణ క్యాబినెట్ మంత్రులకు…
రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీకి సూచించారు. ఆదివారం సచివాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే…
ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని క్యాబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ స్పీచ్ ను కేబినెట్ ఆమోదించినట్లు ఆయన తెలిపారు. అభయ హస్తం ఆరు గ్యారెంటీల్లో అమల్లో భాగంగా…
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ సూర్యాపేట జిల్లా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా ప్రాజెక్ట్ లను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభత్వానికి ప్రజలు చెప్పు దెబ్బలు కొడతారన్నారు. తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు సీఎం రేవంత్.. కేసీఆర్ పై ఎదురు దాడికి దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ లాలూచీ పడి ప్రాజెక్ట్ లను అప్పగించారని, కేసీఆర్ మాట్లాడక ముందే…