ఉప్పల్లో ఈ నెల 21వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదర్శ్ నగర్ లో ఈ నెల 21 వ తేదీన సాయికుమార్ అనే వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ నెల 22 వ తేదిన సాయి కుమార్ చనిపోయాడు. అయితే నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ కేసుల మల్కాజ్గిరి డీసీపీ పద్మజ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీన జరిగిన మర్డర్…
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గానికి బీఆర్ఎస్లో టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. ఆ పార్టీ నుంచి పలువురు నేతలు బరిలోకి దిగుతున్నారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో మల్కాజిగిరి ఒకటి, వివిధ పార్టీలకు చెందిన నేతలు ఎక్కువగా కోరుతున్నారు. పలువురి పేర్లు ప్రచారంలో ఉండగా, మాజీ మంత్రి మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డికి టికెట్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తన కుమారుడికి టికెట్పై పార్టీ తనకు హామీ ఇచ్చిందని చెప్పారు. కుటుంబ సభ్యులకు టికెట్…
గ్రేటర్లో బీఆర్ఎస్కు పెద్ద దెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్మిక విభాగం అధినేత శోభన్రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పంపారు. పార్టీ విధానం వల్ల తమకు నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో బీఆర్ఎస్ కార్యకర్తలు బతకడం కష్టమని, కష్టకాలంలో మీ వెంట ఉన్న కార్యకర్తలు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో బాధపడ్డారన్నారు. తాను 24 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నానన్నారు.…
వివిధ రంగాల్లో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలపాలన్న ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యక్తం చేశారు. కులం, మతం లేదా వర్గాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధి , సంక్షేమాన్ని పెంపొందించడానికి మోడీ నిబద్ధతను మీడియాకు ఒక ప్రకటనలో అరుణ వెల్లడించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో పారిశ్రామిక వృద్ధి , వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారతదేశం యొక్క పురోగతిని హైలైట్ చేస్తూ, ఆర్థిక సమతుల్యత , వృద్ధిని నడిపించడంలో మోడీ నాయకత్వాన్ని…
మహాలక్ష్మి పథకం అమలు తరువాత కూడా ఆటో కొనుగోలు పెరిగాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆటో కార్మికులకు ఆర్ధిక సాయంపై సమీక్ష చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కుల జనగణనపై బీహార్లో చేసిన విధానంపై అధ్యయనం చేశామని ఆయన తెలిపారు. త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. ఏజీతో కూడా మాట్లాడుతున్నాం సమస్యలు రాకుండా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలా.. ? ఏవిధంగా చేయాలి అనేది త్వరలో…
మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఎక్కడ యుద్దం చేస్తారో వారికే తెలియదని సెటైర్లు వేశారు. అసలు కలిసి యుద్ధం చేస్తారో లేదో కూడా పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు కి తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాలలో పోటీకి సిద్దమని, జనసేన ఎన్ని చోట్ల యుద్దానికి…
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయన్నారు. పొత్తులో ఉండి నేతలతో చివాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారని, పవన్ లాంటి అనైతికమైన రాజకీయవేత్త దేశంలోనే లేరని ఆయన విమర్శలు గుప్పించారు. ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీని సంప్రదించకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొన్నటి దాక ఓట్లు కొనకూడదని చేగువేరాలాగ కాకమ్మ కథలు చెప్పాడని,…
ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సీరియస్ కామెంట్లు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశం పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పని చేయాలన్నారు. ఓ రాజకీయ పార్టీకో.. పొలిటికల్ లీడర్లకు అధికారులు అనుకూలంగా ఉండకూడదని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల అధికారులుగా ఉన్న వాళ్లు బాధ్యతతో వ్యవహరించాలని, అధికారులు ప్రజల పట్ల బాధ్యతతో ఉండాలి కానీ.. పార్టీ పట్ల కాదనే విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు పురందేశ్వరి. తప్పులు…
సోషియల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న రమణధీక్షితులు ఆరోపణలపై ప్రధాన అర్చకులు వేణుగోపాల్ ధీక్షితులు, కృష్ణశేషాచల ధీక్షితులు స్పందించారు. ప్రధాన అర్చకులు వేణుగోపాలధీక్షితులు మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్ర్తబద్దంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామన్నారు. రమణధీక్షితులు ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని, రంగనాయకులు మండపంలో రమణధీక్షితులు హయంలోనే మరమ్మత్తు పనులు నిర్వహించారన్నారు. ఆలయంలో తవ్వకాలు అంటు రమణధీక్షితులు తరుచు ఆరోపణలు చేస్తూన్నారని, రమణధీక్షితులును సియం జగన్ నాలుగు సంవత్సరాలు క్రితమే గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించినా విధులుకు హజరుకావడం లేదన్నారు.…
నేను ఎప్పుడు,ఏ పార్టీ లో చేరేది త్వరలోనే చెప్తా అన్నారు ఎంపీ కృష్ణ దేవరాయ. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. వైసీపీలోకి వెనక్కు వచ్చే ఆలోచన లేదని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా లో వచ్చే వార్తలకు నేను స్పందించనని ఆయన వెల్లడించారు. నేను పార్టీకి విశ్వాస ఘాతానికి పాల్పడ్డానని కామెంట్లు చేసే వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారో లేక వేరే వాళ్ళ స్క్రిప్ట్ లు చదువుతున్నా రో తేల్చుకోవాలన్నారు. మంచి రోజు చూసుకుని అన్ని విషయాలు మీడియా…