మహాలక్ష్మి పథకం అమలు తరువాత కూడా ఆటో కొనుగోలు పెరిగాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆటో కార్మికులకు ఆర్ధిక సాయంపై సమీక్ష చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కుల జనగణనపై బీహార్లో చేసిన విధానంపై అధ్యయనం చేశామని ఆయన తెలిపారు. త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. ఏజీతో కూడా మాట్లాడుతున్నాం సమస్యలు రాకుండా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలా.. ? ఏవిధంగా చేయాలి అనేది త్వరలో…
మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఎక్కడ యుద్దం చేస్తారో వారికే తెలియదని సెటైర్లు వేశారు. అసలు కలిసి యుద్ధం చేస్తారో లేదో కూడా పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు కి తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాలలో పోటీకి సిద్దమని, జనసేన ఎన్ని చోట్ల యుద్దానికి…
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయన్నారు. పొత్తులో ఉండి నేతలతో చివాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారని, పవన్ లాంటి అనైతికమైన రాజకీయవేత్త దేశంలోనే లేరని ఆయన విమర్శలు గుప్పించారు. ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీని సంప్రదించకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొన్నటి దాక ఓట్లు కొనకూడదని చేగువేరాలాగ కాకమ్మ కథలు చెప్పాడని,…
ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సీరియస్ కామెంట్లు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశం పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పని చేయాలన్నారు. ఓ రాజకీయ పార్టీకో.. పొలిటికల్ లీడర్లకు అధికారులు అనుకూలంగా ఉండకూడదని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల అధికారులుగా ఉన్న వాళ్లు బాధ్యతతో వ్యవహరించాలని, అధికారులు ప్రజల పట్ల బాధ్యతతో ఉండాలి కానీ.. పార్టీ పట్ల కాదనే విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు పురందేశ్వరి. తప్పులు…
సోషియల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న రమణధీక్షితులు ఆరోపణలపై ప్రధాన అర్చకులు వేణుగోపాల్ ధీక్షితులు, కృష్ణశేషాచల ధీక్షితులు స్పందించారు. ప్రధాన అర్చకులు వేణుగోపాలధీక్షితులు మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్ర్తబద్దంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామన్నారు. రమణధీక్షితులు ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని, రంగనాయకులు మండపంలో రమణధీక్షితులు హయంలోనే మరమ్మత్తు పనులు నిర్వహించారన్నారు. ఆలయంలో తవ్వకాలు అంటు రమణధీక్షితులు తరుచు ఆరోపణలు చేస్తూన్నారని, రమణధీక్షితులును సియం జగన్ నాలుగు సంవత్సరాలు క్రితమే గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించినా విధులుకు హజరుకావడం లేదన్నారు.…
నేను ఎప్పుడు,ఏ పార్టీ లో చేరేది త్వరలోనే చెప్తా అన్నారు ఎంపీ కృష్ణ దేవరాయ. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. వైసీపీలోకి వెనక్కు వచ్చే ఆలోచన లేదని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా లో వచ్చే వార్తలకు నేను స్పందించనని ఆయన వెల్లడించారు. నేను పార్టీకి విశ్వాస ఘాతానికి పాల్పడ్డానని కామెంట్లు చేసే వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారో లేక వేరే వాళ్ళ స్క్రిప్ట్ లు చదువుతున్నా రో తేల్చుకోవాలన్నారు. మంచి రోజు చూసుకుని అన్ని విషయాలు మీడియా…
గుంటూరు మిర్చి యార్డ్ లో ఇసుక వేస్తే రాలనీ పరిస్థితి తలెత్తింది ..గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, కర్ణాటక, తెలంగాణ, లాంటి ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో వస్తున్న మిర్చి టిక్కీల వాహనాలతో మార్కెట్ యార్డ్ నిండిపోయింది ….దీంతో ఎగుమతి దారులు సరుకును తరలించలేక పోవడం, మరో వైపు వస్తున్న సరుకును ఆపలేని పరిస్థితిలో పాలకవర్గం ఉండటంతో, మిర్చి రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు… దీనికి తోడు పెద్ద ఎత్తున వస్తున్న మిర్చి దెబ్బకు వ్యాపారులు…
రోడ్లపై మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే తొలి ఆరు నెలల్లోనే రోడ్లన్నీ వేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లపై సీఎం జగన్ మేనిఫెస్టోలో కీలక ప్రకటన చేయబోతున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలోని పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికే తమకు 2 ఏళ్లు పట్టిందని అన్నారు. ఆ తర్వాత కరోనా వచ్చి, పనులు ఆగిపోయాయని నాని వివరించారు. అంతేకాకుండా.. మేమూ సిద్ధం అంటూ ఫ్లెక్సీలతో హడావిడి చేస్తున్న జనసేన అధినేత…
రేషన్ లబ్ధిదారులకు మార్చి 1 నుంచి రాగిపిండిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కిలో ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనుంది. రాగిపిండి ధర బహిరంగ మార్కెట్ లో కేజీకి రూ.40పైనే పలుకుతుండగా, ప్రభుత్వం రూ.11కే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో కార్డుకు ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలు ఇస్తున్న సంగతి తెలిసిందే. రాగి పిండిని ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నంలో…
టీడీపీ నేత, ఎన్నారై మన్నెం వెంకటరమణ (53) కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఏథెన్స్ విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. కాగా వెంకటరమణ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అమెరికాలోని పలు జాతీయ స్థాయి తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే.. అమెరికాలోని న్యూ జెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా……