AP Politics : టీడీపీలో లెక్క చిక్కులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు టీడీపీలో లెక్క చిక్కులకు దారి తీసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన ప్రకటించిన 12 స్థానాలు ఒక లెక్క ఉంటే.. ప్రకటించాల్సిన ఐదు స్థానాలు మరో లెక్కగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా వర్గ పోరు, ఆశావాహుల లిస్టు పెద్ద ఎత్తున ఉన్న నియోజకవర్గాల అభ్యర్థుల లిస్టును పెండింగ్ లో పెట్టింది టీడీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో.. ఆచితూచి అడుగులు వేస్తోంది టీడీపీ. పలనాడు జిల్లాలోని కీలక నేత యరపతినేని శ్రీనివాసరావు కు సీటును మొదటి లిస్టులో ప్రకటించకపోవడంతో పలనాడులో తీవ్ర చర్చకు దారితీసింది. యరపతినేనికి సీటు ఇస్తారా లేదా అంటూ చర్చ మొదలైంది. అంతేకాకుండా.. గురజాల నియోజకవర్గంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు, పల్నాడు జిల్లా కేంద్రంలో టీడీపీ గెలిచి తీరాలన ఆలోచనతో యరపతినేనికి స్థాన బదిలీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. యరపతినేనిని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేపిస్తారని వార్తలు గుప్పుమన్నాయి. అందుకే గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టును టీడీపీ ప్రకటించలేకపోయిందని భావిస్తున్నారు టీడీపీ సీనియర్లు… ఇక గురజాల నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీలో చేరబోతున్న జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇస్తారా లేదా అన్న సందిగ్ధత నెలకొంది.
Botsa Satyanarayana : విజయనగరంలో పర్యటించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ
Also Read
- Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ 'పెసరపప్పు పాయసం' చేసేయండి ఇలా.!
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- France: మ్యూజిక్ ఫెస్టివల్లో షాకింగ్ ఘటనలు.. సిరంజిలు గుచ్చి యువతులపై అత్యాచారాలు..
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు!
పెదకూరపాడులో రెండుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కు ఈసారి మొదటి లిస్టులో సీటు దక్కలేదు. అయితే.. ఈ నేపథ్ంయలో కొమ్మాలపాటి కి సీటు లేదని ప్రచారం తెర పైకి వచ్చింది. ఇక్కడి నుండి టీడీపీ ఒక యువ నాయకుడిని ఎన్నికల బరిలోకి దింపే అవకాశం ఉందని తెలుస్తోంది… అయితే స్థానిక ఎమ్మెల్యేకి సమీప బంధువు కావడం స్థానిక టీడీపీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో.. ఈ నేపథ్యంలోనే పెదకూరపాడు టికెట్ను అధిష్టానం పెండింగ్ పెట్టింది అన్న ప్రచారం జరుగుతోంది. ఇక గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆశావాహుల లిస్టు ఉంది. దీంతో.. స్థానికంగా బలమైన నాయకులు దొరకపోవడం, బీసీ సామాజిక వర్గానికి ఇక్కడ సీటు కేటాయించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉండడంతో గుంటూరు పశ్చిమలో పరిస్థితి క్లారిటీ లేదు. గుంటూరు తూర్పులో ముస్లిం వర్గంలో మహిళకు చోటు ఇవ్వాలన్న ఆలోచన లో టీడీపీ ఉన్నట్లు సమాచారం. ఇక రెండవ లిస్టు వచ్చేవరకు ఇంచార్జ్లకు టెన్షన్ తప్పేటట్లు లేదు.
తాజావార్తలు
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Realme P4x 4G: 8000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, 50MP కెమెరాతో.. రియల్మీ P4x 4G విడుదల
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
Aadhaar Rule Change from July 1: జూలై 1 నుంచి ఆధార్లో కీలక మార్పు.. ఈ సేవ పూర్తిగా ఉచితం!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!