తెలంగాణలో నేడు రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్రలు కొనసాగనున్నాయి. నారాయణపేట, మహబూబ్నగర్లో రోడ్ షోల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. నారాయణపేట పట్టణం శాసన్ పల్లి రోడ్, లక్ష్మీ ఫంక్షన్ హల్ లో ఉదయం 9గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ధన్వాడలో రోడ్ షో, స్థానిక మహిళలతో కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. దేవరకద్ర, లాల్…
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలతో ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్లో గత రెండేళ్లుగా అగ్నిప్రమాదాలు పెరిగిపోవడంతో రానున్న వేసవిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అగ్నిమాపక శాఖతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) యొక్క ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టరేట్ కూడా నివాసితుల భద్రతను నిర్ధారించడానికి సన్నద్ధమవుతోంది. నగరంలో పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, కార్యాలయ…
గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి మండలంలో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. పండ్ల తోటలు, ఆయిల్ పామ్ గిరిజన రైతులకు సాగు కోసం అధిక శాతం నిధులు, ఆర్థిక వెసులుబాటు ఇవ్వబడుతుంది. ఆ దిశగా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కృషి చేయాలని అన్నారు. భట్టి విక్రమార్క ఆదివారం జిల్లాలోని భద్రాచలం ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వ్యవసాయశాఖ…
ఎల్లుండి (20 వ తేదీ)నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపు భాగ్యలక్ష్మి ఆలయం లో యాత్ర వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మొత్తం 5 యాత్రలు చేపట్టనుంది తెలంగాణ బీజేపీ. అయితే.. ఎల్లుండి నాలుగు చోట్ల నుండి యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుండి కాకతీయభద్రాద్రి క్లస్టర్ యాత్ర ప్రారంభం కానుంది. రెండు యాత్రలను ఇద్దరు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ప్రారంభించనున్నారు. ఇందులో.. కొమురం భీం క్లస్టర్…
మేడారం సమ్మక్క-సారక్క జాతరకు ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ నిర్ణయించింది. ఆర్టీసీ రీజియన్లోని వివిధ ప్రాంతాల నుంచి 850 బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మేడారం ప్రత్యేక బస్సు సర్వీసుల శిబిరంలో రీజనల్ మేనేజర్ ఎస్ సుచరిత బస్సు సర్వీసులను లాంఛనంగా ప్రారంభించారు. ఆదివారం నుండి ఫిబ్రవరి 25 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు 24 గంటలూ నడపబడతాయి. CM Jagan: ఎన్నికలయ్యాక టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు..…
తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీలో పాత ప్రభుత్వంపై బురద చల్లడం కోసమే జరిపారన్నారు. ప్రభుత్వం ఏమి చేయదల్చుకుందో నిర్దిష్టంగా చెప్పలేదని, మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలు 100 రోజుల్లో కాదు..72 రోజుల్లోనే అమలు చేయలేమని చేతులు ఎత్తేసిందన్నారు నిరంజన్ రెడ్డి. హరీష్ రావు మాట్లాడు తుంటే ఆరుగురు మంత్రులు కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. Rashmika Mandanna: చావు…
దేశంలో రాజకీయ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ 3.0 ప్రభుత్వం రాబోతుందన్నది ఖాయం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు గత 9.5 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో సాధించిన మహత్తర విజయాలు అందరూ చూడదగినవేనన్నారు. దీనికి విరుద్ధంగా, పాత పార్టీ కాంగ్రెస్కు ఇది క్రమంగా క్షీణించిందని, ఇది దిక్కులేని, దృష్టిలేనిదిగా మారిందని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుండి పార్టీ టికెట్…
తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచన మేరకు ఈ బదిలీలు జరుగుతున్నాయి. అయితే.. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలోని పలు కీలక శాఖలో భారీగా బదిలీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా 61 మంది ఏసీపీ అధికారులను బదిలీ చేస్తున్నట్లు డీజీపీ రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే శనివారం 12 మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేశారు. ఎన్నికల సంఘం…
తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల ప్రధాన మంత్రి ప్రకటించిన జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని తేదీ 17 ఫిబ్రవరి 2024 నాడు లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు పసుపు రైతుల చిరకాల ఆకాంక్ష. గత పార్లమెంట్ ఎన్నికలలో పసుపు రైతులు పెద్ద ఎత్తున నిజామాబాద్ ఎం.పీ స్థానానికి నామినేషన్లు వేసి నిరసన తెలిపిన విషయము అందరికి విదితమే. ఈ క్రమంలో…
నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగాయి. అయితే.. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కేఆర్ఎంబీకి అప్పగించబోని చెప్పించింది బీఆర్ఎస్ అని ఆయన అన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ విజయమని, మేము గొంతు విప్పాకే అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరి నిలదీశామని, ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వారి పిపిటి తప్పుల…