AP NGO Chief : ఎల్లుండు జరగాల్సిన ఛలో విజయవాడకు బ్రేకులు
ఛలో విజయవాడకు బ్రేకులు వేయనున్నాయి ఏపీఎన్జీఓ, అనుబంధ సంఘాల జేఏసీ. ఎల్లుండు జరగాల్సిన ఛలో విజయవాడకు బ్రేకులు వేసేందుకు సిద్ధమయ్యారు. అరెస్టులు, పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒక మెట్టు దిగి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం లోని అంశాలు వ్రాతపూర్వక మినిట్స్ ఇస్తాం అన్నారన్నారు. 27న జరగాల్సిన ఛలో విజయవాడ ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామన్నారు.
మా 49 డిమాండ్లు రెండు వారాల్లో పరిష్కరిస్తాం అన్నారని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రయారిటీ లో తీసుకున్నారన్నారు. పెన్షనర్ల అంశంలో అతి త్వరలో ఉత్తర్వులిస్తాం అన్నారని, మా 49 డిమండ్లు సీఎస్ ఆధ్వర్యంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. ప్రభుత్వం రెండు దఫాలుగా జాయింట్ స్టాఫ్ కౌన్సి్ నిర్వహించిందని, మేం మా డిమాండ్లను బలంగా వినిపించామన్నారు. ఈనెల 24న జరిగిన జీఓఎం లో పీఆర్సీ సరాసరి ఇస్తామని ఆయన తెలిపారు. పీఆర్సీ ఇచ్చే ఆనవాయితీ లేదు అన్నారని, మన్మోహన్ సింగ్ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం అని తెలిపారన్నారు.
Also Read
తాజావార్తలు
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!