జగిత్యాల జిల్లా ధర్మపురిలో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. నా ఆస్తులు లెక్క పెట్టడానికి గెలిచినవా, ధర్మపురి ప్రజలకు పని చేయడానికి గెలిచినవా ఎమ్మెల్యేగా అడ్లూరి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకమని ఆయన వ్యాఖ్యానించారు. ధర్మపురి నియోజకవర్గంలోని పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని, కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరు అయిన అభివృద్ధి పనులను అన్నింటిని…
రైతులు ఎవరు అధైర్యపడొద్దు జిల్లా యంత్రాంగంతో మాట్లాడి మార్కెట్ యార్డ్ లోనే PACS ధాన్యం కొనుగోలు సెంటర్ని ప్రారంభించినమన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తొందరపడి దళారులకు అమ్ముకొని మోసం మోసపోవద్దన్నారు. తేమ పేరుతో రైతులను దళారులు,అధికారులు కలిసి దోచుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తేమ శాతం ఉన్నవాటికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదని, నాలుగు రోజులుగా వ్యవసాయ మార్కెట్లో కపాల కాస్తున్న రైతులు ఎక్కడ వర్షాలు వస్తాయని భయపడి దళారులకు…
గత ప్రభుత్వంలో దుశ్శాసన పాత్ర పోషించిన ఎంఐఎం ప్లేట్ పిరాయించి కాంగ్రెస్ పంచన చేరిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చీకటి వ్యాపారాలు చేస్తూ, దౌర్జన్యంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పార్టీ ఎంఐఎం అని ఆయన మండిపడ్డారు. ఆ పార్టీ కి చీకటి దందాలకు అండా కావాలి, బీజేపీ ఓడి పోవాలన్నారు కిషన్ రెడ్డి.…
చేవెళ్లలో బిజెపి జెండాను ఎగరవేస్తానన్నారు ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన చేవెళ్ల నియోజకవర్గం లో పర్యటించారు. చేవెళ్ల మండలంలోని పామెన, కందవాడ, పల్గుట్ల, మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే ప్రజలందరి సమస్యను పరిష్కరిస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం…
ఎన్నికల్లో ప్రియాంకా గాంధీతో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి, నిండు అసెంబ్లీలో చేతులెత్తేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇవాళ ఆయన సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరువును వెంట తీసుకువచ్చిందన్నారు. సిద్దిపేటలో రేవంత్ రెడ్డి 150 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేశాడు…వెటర్నరీ కళాశాలను కొడంగల్ కు తీసుకుపోయాడని, దేవున్ని రాజకీయాలకు వాడుకోవడం ఒక్క బీజేపీ కే దక్కుతుందన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ అంత భక్తుడు…
అవినీతి, అరాచకాలు గత ప్రభుత్వం లో జరిగిన దానికన్నా ఎక్కువ జరుగుతున్నవన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడ్డ వారిని కటకటాల వెనక్కి పంపిస్తా అన్న ముఖ్యమంత్రి.. ఇప్పుడు లోలోపల సెటిల్మెంట్ లు బయటకు వస్తున్నాయన్నారు. రేవంత్ అంటే నా వంతు ఎంత అని అడుగుతున్నాడు ఆట అని, రేటెంత రెడ్డి నీ రేట్ ఎంతా అని వెళ్లిన వారు అడుగుతున్నారు అట… అని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతి బా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ హాజరై.. మహాత్మా జ్యోతి బా పూలే చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతి బా పూలే ఆశయాలకు అనుగుణంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పదేళ్లుగా సామాజిక న్యాయాన్ని మోదీ అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహాత్మా జ్యోతి బా పూలే…
రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులు, వడదెబ్బ నివారణ చర్యల పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈరోజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో తాగునీటి పరిస్థితిని నిశితంగా పరిశీలించి, నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా అద్భుతమైన టీమ్ వర్క్ చేసినందుకు జిల్లా కలెక్టర్లను ఆమె అభినందించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు అందుబాటులో ఉంచామని ఆమె అన్నారు.…
ఖమ్మంలో బుధవారం ‘కార్బైడ్ రహిత మామిడి మేళా’ను వనజీవి రామయ్య ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన రైతు బానోతు లక్ష్మణ్నాయక్ పెవిలియన్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న మేళాలో సహజసిద్ధంగా పండిన వివిధ రకాల మామిడి పండ్లను సరసమైన ధరలకు ప్రజలకు అందిస్తున్నారు. మేళాను ప్రారంభించిన అనంతరం రామయ్య మాట్లాడుతూ కార్బైడ్ రహిత మామిడి పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదని, కృత్రిమ పదార్థాలతో పండిన మామిడి పండ్లను నివారించాలని, అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని…
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తుక్కుగూడ సభలో రాహూల్ గాంధీ నోటి చేత పచ్చి అబద్ధాలు మాట్లాడించారన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాపం రాహుల్ గాంధీకి ఏం తెలియదు రేవంత్ రెడ్డి ఏం చెప్పితే అది మాట్లాడి పోయాడని, బీఆర్ఎస్ హయంలోనే 503 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం….. వీటికీ మరో 60 ఉద్యోగాలు కలిపి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. నిరుద్యోగులు ఇవ్వన్ని గమనిస్తున్నారని, టెట్ పరీక్ష…