Konda Vishweshwar Reddy : చేవెళ్లలో గెలుపు నాదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేవెళ్లలో బిజెపి జెండాను ఎగరవేస్తానన్నారు ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన చేవెళ్ల నియోజకవర్గం లో పర్యటించారు. చేవెళ్ల మండలంలోని పామెన, కందవాడ, పల్గుట్ల, మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే ప్రజలందరి సమస్యను పరిష్కరిస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలకు పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం, సంక్షేమ పథకాలు కాలేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి కెసిఆర్ తెలంగాణ ప్రజలను నిలువు నా మోసం చేశారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ విజయం ఖాయమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ కి దేశంలో రాజకీయంగా ఎదురులేదని ఆయన మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో చేవెళ్ల బిజెపి కన్వీనర్ కేఎస్ రత్నం, చేవెళ్ల మొయినాబాద్ మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు, అనుచరులు పాల్గొన్నారు.
MP K.Laxman : కర్పూరీ ఠాకూర్కి భారత రత్న ఇచ్చింది మోడీ ప్రభుత్వం
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు బిజెపి చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో పర్యటించిన ఆయన స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మోడీ పాలనలో ప్రజలంతా మతసామరస్యంతో కలిసిమెలిసి జీవించారని ఆయన కొనియాడారు. రంజాన్ పర్వదినం ముస్లిం సోదరుల జీవితాల్లో సుఖ సంతోషాలను తీసుకురావాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి : 9963980259/ 9959154371
Pakistan: పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం..
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!