Konda Vishweshwar Reddy : చేవెళ్లలో గెలుపు నాదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేవెళ్లలో బిజెపి జెండాను ఎగరవేస్తానన్నారు ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన చేవెళ్ల నియోజకవర్గం లో పర్యటించారు. చేవెళ్ల మండలంలోని పామెన, కందవాడ, పల్గుట్ల, మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే ప్రజలందరి సమస్యను పరిష్కరిస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలకు పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం, సంక్షేమ పథకాలు కాలేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి కెసిఆర్ తెలంగాణ ప్రజలను నిలువు నా మోసం చేశారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ విజయం ఖాయమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ కి దేశంలో రాజకీయంగా ఎదురులేదని ఆయన మూడోసారి ప్రధాని కావడం ఖాయమన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో చేవెళ్ల బిజెపి కన్వీనర్ కేఎస్ రత్నం, చేవెళ్ల మొయినాబాద్ మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు, అనుచరులు పాల్గొన్నారు.
MP K.Laxman : కర్పూరీ ఠాకూర్కి భారత రత్న ఇచ్చింది మోడీ ప్రభుత్వం
Also Read
- Rainfall Deficit: ఖరీఫ్ సీజన్కు రుతుపవనాల సెగ.. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం..
- Asim Munir: అసిమ్ మునీర్ హత్యకు కుట్ర.. మొసాద్ హిట్ లిస్టులో పాక్ ఆర్మీ చీఫ్..
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో విప్లవాత్మక మార్పులు.. టెస్ట్, వన్డే, టీ20లకు వేర్వేరు టీమ్స్..!
- Green Card Holders: గ్రీన్ కార్డ్ హోల్డర్లకు షాక్.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు బిజెపి చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో పర్యటించిన ఆయన స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మోడీ పాలనలో ప్రజలంతా మతసామరస్యంతో కలిసిమెలిసి జీవించారని ఆయన కొనియాడారు. రంజాన్ పర్వదినం ముస్లిం సోదరుల జీవితాల్లో సుఖ సంతోషాలను తీసుకురావాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి : 9963980259/ 9959154371
Pakistan: పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం..
తాజావార్తలు
-
NBK 112: 150 కోట్లతో బాలయ్య-కొరటాల మాస్ బ్లాక్ బస్టర్
-
Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులపై భట్టి బిగ్ బాంబ్..!
-
Nirav Modi: నీరవ్ మోడీకి బిగ్ షాక్.. రూ.100 కోట్లు కట్టాల్సిందేనని లండన్ కోర్టు సంచలన తీర్పు!
-
Rainfall Deficit: ఖరీఫ్ సీజన్కు రుతుపవనాల సెగ.. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం..
-
Asim Munir: అసిమ్ మునీర్ హత్యకు కుట్ర.. మొసాద్ హిట్ లిస్టులో పాక్ ఆర్మీ చీఫ్..
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!