Odisha: ఒడిశాలో పడవ ప్రమాదం.. ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలోని మహానదిలో శుక్రవారం జరిగిన పడవ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని ఖర్సియాకి చెందిన 50 మందికిపైగా ప్రయాణికులు బార్ఘర్ జిల్లా పథర్సేని కుడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా పడవ బోల్తా పడింది. దీంతో అందులోని 50 మంది నదిలో మునిగిపోయారు. వారిలో కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు నిలుపుకోగా ఏడుగురు ఈత రాక నీట మునిగిపోయారు. జార్సుగూడ జిల్లా రెంగలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా ఘాట్ వద్దకు చేరుకోగానే బోటు బోల్తా పడినట్లు సమాచారం. మత్స్యకారులు.. 35 మంది ప్రయాణికులను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మరో 13 మందిని రక్షించారు. ఏడుగురు గల్లంతయ్యారని.. వారిని వెతికేందుకు సర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఘటనకు కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో స్కూబా డైవర్లు, సెర్చ్ కెమెరాలను ఘటనాస్థలికి తరలించారు.
Also Read
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
పడవ ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని నవీన్ భరోసా ఇచ్చారు. ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
India Bans Sugar Exports: చక్కెర ఎగుమతులపై భారత్ నిషేధం.. ఎందుకు? పూర్తి వివరాలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!