Odisha: ఒడిశాలో పడవ ప్రమాదం.. ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలోని మహానదిలో శుక్రవారం జరిగిన పడవ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని ఖర్సియాకి చెందిన 50 మందికిపైగా ప్రయాణికులు బార్ఘర్ జిల్లా పథర్సేని కుడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా పడవ బోల్తా పడింది. దీంతో అందులోని 50 మంది నదిలో మునిగిపోయారు. వారిలో కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు నిలుపుకోగా ఏడుగురు ఈత రాక నీట మునిగిపోయారు. జార్సుగూడ జిల్లా రెంగలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా ఘాట్ వద్దకు చేరుకోగానే బోటు బోల్తా పడినట్లు సమాచారం. మత్స్యకారులు.. 35 మంది ప్రయాణికులను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మరో 13 మందిని రక్షించారు. ఏడుగురు గల్లంతయ్యారని.. వారిని వెతికేందుకు సర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఘటనకు కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో స్కూబా డైవర్లు, సెర్చ్ కెమెరాలను ఘటనాస్థలికి తరలించారు.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
పడవ ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని నవీన్ భరోసా ఇచ్చారు. ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..