ఈటల రాజేందర్ ఈ నెల 14న బిజేపి తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ మారినప్పటి నుంచి.. ఈటలపై టీఆర్ఎస్ నాయకులు మాటల దాడి చేస్తున్నారు. తాజాగా అటు కాంగ్రెస్ నాయకులు కూడా ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బిజెపి నేత పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ నియోజకవర్గం లో అభివృద్ధి జరగలేదని… తాను చేసిన అభివృద్ధి కనబడుతుందని తెలిపారు. ఎన్నికలు ఇప్పుడే రావని.. అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.…
టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్పై ఘాటు లేఖ విడుదల చేశారు మావోయిస్టులు.. తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదలైంది.. ఈటల.. అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను ఖండించిన తెలంగాణ మావోయిస్టు పార్టీ… తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తూ కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని అందుకోసం ఆర్ఎస్ఎస్ నుండి పోరాడాలని…
టీఆర్ఎస్ను వీడి.. బీజేపీ గూటికి చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్కు.. అవమానం జరిగిందా? దానిపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జోరందుకుందా? ఇంతకీ ఢిల్లీలో ఈటలకు ఎదురైన అనుభవాలేంటి? సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న దృశ్యాలు ఏం చెబుతున్నాయి? లెట్స్ వాచ్.. బీజేపీలో ఈటల చేరికపై ఓ రేంజ్లో ట్రోలింగ్ కొద్దిరోజలుగా తెలంగాణ రాజకీయాలు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చుట్టూ తిరుగుతున్నాయి. మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చకచకా జరిగిపోయాయి. వివిధ…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరడంపై తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. తెలంగాణ కోసం ఏమీ చేయని పార్టీ లో ఈటల రాజేందర్ చేరారు. బీజేపీలో రాజేందర్ చేరడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈటలది ఆత్మ గౌరవ పోరాటం కాదు.. కేవలం ఆస్తుల కోసం ఆరాటం అని వినయ్ భాస్కర్ ఎద్దేవా చేశారు. ఆరేండ్ల క్రితమే ఈటెల బీజేపీలో చేరేందుకు స్క్రిప్ట్ రాసుకున్నారు. బీజేపీలో చేరినందుకు రాజేందర్ ప్రజలకు…
కాంగ్రెస్, బీజేపీ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారు.. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. నకిరేకల్లో నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కడుతున్న ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇచ్చిందా..? అని ప్రశ్నించారు.. కానీ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ప్రగతి పథంలో నడిపిస్తున్న నాయకుడు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అని ప్రశ్నించారు.. ఈనాడు తెలంగాణ లో…
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఇవాళ మర్యాదపూర్వకంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను కలిశారు. బిజెపి, తెలంగాణ ప్రజల తరఫున ఎన్వీ రమణకు ఈ సందర్బంగా హార్దిక శుభాకాంక్షలు తెలిపారు కె.లక్ష్మణ్. ఆనంతరం కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. భారత ప్రధాన న్యాయమూర్తి పదవిలో తెలుగు వ్యక్తి అధిరోహించడం ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చొరవతో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తెలంగాణ హైకోర్టులో 42…
తెలంగాణ సర్కార్ పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణ భూముల అమ్మకంపై ఆర్థికమంత్రి హరీష్ రావు వాదన చాలా అసంబద్ధంగా ఉందని… గత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూముల అమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగానే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. మరి, ధనిక రాష్ట్రం అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ఇప్పటి తెలంగాణలో ఈ భూముల అమ్మకాలు, వేలాలు ఏంటి? అని నిలదీశారు. అప్పుల పాలు చేసినం మన తెలంగాణ రాష్ట్రాన్ని… అని…
టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ నిన్నటిరోజున బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ధర్మేంధ్రప్రధాన్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా, ఈరోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. బీజేపీలో చేరిన ఈటలపై టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిరోజే ఈటలకు పరాభవం ఎదురైందని, నడ్డా సమక్షంలో ఈటల ఎందుకు చేరలేదని విమర్శించారు. కమ్యునిస్టుల భావజాలం ఎక్కడపోయిందని, ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల బీజేపీలో చేరారని అన్నారు. టీఎంసీలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేసి బీజేపీ…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ఈటల రాజేందర్ లోని కమ్యూనిస్టు చనిపోయాడా?ఈటల సిద్ధాంతాలు, భావజాలం, వామపక్ష లక్షణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాజకీయ మనుగడ కోసం, కేసుల నుండి తప్పించుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే ఈటల బీజేపీలో చేరారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి అనేక విధాలుగా నష్టం చేసిన బీజేపీలో ఈటెల రాజేందర్ ఎలా చేరాడు? బీజేపీలో ఈటలకు సముచిత గౌరవం దక్కేలా లేదన్నారు. బీజేపీ…
ఈటల బీజేపీలో చేరడం హాస్యాస్పదం అని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈటల హిట్లర్ వారసుల వద్ద చేరి నియంతృత్వముపై పోరాడతా అంటున్నారు. ఆయన ముందే ప్రిపేర్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈటల ఇంతకాలం చెప్పిన మాటలకు…చేతలకు పొంతన లేదు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం తీసుకువచ్చింది. ఇవి నల్ల చట్టాలు… రైతులను నడ్డివిరిచే చట్టాలు అని ఈటల అన్నారు. కానీ ఇప్పుడు ఆయన బీజేపీలో చేరి ప్రజలకు ఏ న్యాయం చేస్తారో చెప్పాలి. ఈటల…