తెలంగాణలో బీజేపీని మరింతగా ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ పర్యటన ఉద్దేశ్యం కూడా అదే అంటున్నారు బీజేపీ నేతలు. తన పర్యటనలో ఆయన అనేక అంశాలను పరిశీలించనున్నారు. బీజేపీ ముఖ్య నేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్ లతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సంస్థాగత అంశాలు, నేతల మధ్య సమన్వయం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ పై చర్చించనున్నారు సంతోష్. బీజేపీ బలోపేతం పై దృష్టి…