భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టుపట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు దిక్కులేకుండా పోయిందని అన్నారు. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్ లా మారిపోయారని, రాష్ట్ర పాలనను జన్ పథ్, గాంధీభవన్ ద్వారా నడిపిస్తున్నారని మండిపడ్డారు.
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బీజేపీని స్థాపించిన తొలినాళ్లలో చాలామంది పార్టీని తక్కువచేసి చూశారని, అధికారంలోకి రావడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయని ఆయన గుర్తుచేశారు. అయితే అనేకమంది బీజేపీ కార్యకర్తలు నక్సలైట్లు, పాకిస్థాన్ ఐఎస్ఐకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన విషయాన్ని చెప్పారు. జాతీయ భావజాలం కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ…
PM Modi: భగవాన్ హనుమాన్ స్పూర్తితో దేశంలోని అవినీతి, బంధు ప్రీతి, వారసత్వ రాజకీయాలు, శాంతిభద్రతల సవాళ్లపై పోరాడలని బీజేపీ కృతనిశ్చయంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ హనుమంతుడిలా దేశం కోసం ధృడసంకల్పం, దేశ సంక్షేమం కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనకాడబోమని, పార్టీ కార్యకర్తలు త్యాగం, అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.