తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం కొంత ఆలస్యమైన వచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు ఇంకా రాకపోవడంతో ఏరువాకకు సిద్ధం కావాల్సిన రైతన్నల్లో కొంత ఆందోళన నెలకొంది. అంతేకాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా భానుడి ప్రతాపాగ్నిలో ఉడికిపోతున్న తెలంగాణ వాసులు సైతం నైరుతు రుతుపవనాల కోసం చూస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా వరకు విస్తరించాయని వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో…
తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో అరెస్టైన వైసీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పొడిగిస్తూ రాజమహేంద్రవరం కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 20 వరకు అనంతబాబు రిమాండ్ను పొడిగిస్తున్నట్లు కోర్టు సోమవారం ప్రకటించింది. అంతేకాకుండా అనంతబాబు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ చేపట్టనున్నట్లు ఎస్సీ,ఎస్టీ కోర్టు వెల్లడించింది. అయితే ఇప్పటికే.. సుబ్రహ్మణ్యాన్ని తానే చంపినట్లు అనంతబాబు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా… ఆయనను…