అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. జనవరిలో ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, ఆయన అనేక ముఖ్యమైన నియామకాలను కూడా ప్రకటించారు. ఇందులో బిలియనీర్ ఎలాన్ మస్క్కు ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE) బాధ్యతలు అప్పగించారు. మస్క్ ఎన్నికల్లో ట్రంప్కు బహిరంగంగా మద్దతు ఇవ్వడంతోపాటు భారీగా డబ్బు కూడా ఖర్చు చేసిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా? ఎలాన్ మస్క్ తన ప్రభావం చూపిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది.ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ త్వరలో పదవి నుంచి వైదొలగనున్నట్టు తెలుస్తోంది. సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ సీఈవోకి ఉద్వాసన పలుకుతున్నారనే వార్తలు వస్తున్నాయి. టెస్లా సీఈవోగా ఉన్న ఎలన్ మస్క్ త్వరలో ట్విట్టర్ బాధ్యతలనూ చూసుకుంటారని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం 4,400 కోట్ల డాలర్లకు ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేశారు. అప్పటినుంచి సీఋవో పరాగ్…