Ganja : ఈజీ మనీ ముసుగులో గంజాయి అమ్ముతు పట్టుబడిన ఇద్దరు నిందితులు
- రూ. 25 వేల విలువైన గంజాయి స్వాధీనం
- రూ.20 లక్షల విలువైన వాహనాలు సీజ్
- ఈజీ మనీ ముసుగులో గంజాయి సరఫరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చదువుకుంది ఇంజనీరింగ్. చేస్తున్న వృత్తి మోడల్ ఫోటోగ్రఫీ. తిరిగేది ఖరీదైన కార్లు, బైకుల్లో, వాడుతున్న సెల్ ఫోన్లు చూస్తే రూ. లక్షల ఐ ఫోన్లు . ఖరీదైన అద్దె నివాసముంటు, సమాజంలో బడా బాబుల్లా వ్యహారం. కాని మూడోకంటికి తెలియకుండా గుర్తు చప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం చేస్తూ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులకు పట్టుబ డి ఉన్న పరువు కాస్తా.. బజార్లో పడేసి.. కటకటాల పాలైన యువకుల చీకటి బాగోతం. వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి వసంతనగర్ హౌజ్ నెంబ రు 741, రోడ్ నెంబ రు 21లో ఖరీదైన అద్దె భవనంలో ఇద్దరు ఇంజనీరింగ్ యువకులు గంజాయి అమ్మకాలు చేపడుతున్నారనే సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం ఎస్ టి ఎఫ్ సీఐ నాగరాజు, ఎస్సై జ్యోతితోపాటు సిబ్బంది కలిసి ఇంట్లో సోదాలు నిర్వహించారు.
Hyderabad: మియాపూర్లో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
ఖరీదైన అద్దె భవనంలో ఖమ్మంకు చెందిన బేగం నిలేష్ కుమార్, వరంగల్ డొర్నకల్కు చెందిన సిరాజుల్లా నివాసముంటున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించినపుడు 1.185 కిలోల గంజాయి లభించింది. ఇద్దరు నిందితులను విచారించగా గత కొంత కాలంగా ఇన్స్ట్రా గ్రామ్లో కాకినాడ నుంచి గంజాయిని తెప్పిస్తూ అమ్మకాలు సాగిస్తున్నారని వెల్లడించారని సిఐ తెలిపారు. గంజాయిని కారులోను, బైకులోను తీసుకవచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. వీరివద్ద నుంచి రూ. 15 లక్షల కారు, రూ. మూడు లక్షల విలువ చేసే బైక్, రూ. 3 లక్షల విలువ మూడు ఐ ఫో న్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.25 వేలు. పట్టుబడిన వాహనాల ఖరీదు మాత్రం రూపాయలు 20 లక్షల పైనే ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు ఖమ్మంలోని ఇంజనీరింగ్ సమయములో స్నేహితులు. స్నేహితులుగా హైదారాబాద్ వచ్చి నివాసముంటున్నారు. నిలేష్ కుమార్ మోడల్ ఫోటోగ్రఫీ చేస్తు మరో పక్క గంజాయి అమ్మకాలు చేపడుతూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబ డ్డారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు. గంజాయిని పట్టుకున్న టీమ్లో కానిస్టేబుళ్లు రాజేష్, వికాష్, జయచంద్ర, కాశీలు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్ను అడిషనల్ ఎస్పీ భాస్కర్ అభినందించారు.
Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలోకి “కిమ్” ఆర్మీని దింపిన పుతిన్..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!