Ganja : ఈజీ మనీ ముసుగులో గంజాయి అమ్ముతు పట్టుబడిన ఇద్దరు నిందితులు
- రూ. 25 వేల విలువైన గంజాయి స్వాధీనం
- రూ.20 లక్షల విలువైన వాహనాలు సీజ్
- ఈజీ మనీ ముసుగులో గంజాయి సరఫరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చదువుకుంది ఇంజనీరింగ్. చేస్తున్న వృత్తి మోడల్ ఫోటోగ్రఫీ. తిరిగేది ఖరీదైన కార్లు, బైకుల్లో, వాడుతున్న సెల్ ఫోన్లు చూస్తే రూ. లక్షల ఐ ఫోన్లు . ఖరీదైన అద్దె నివాసముంటు, సమాజంలో బడా బాబుల్లా వ్యహారం. కాని మూడోకంటికి తెలియకుండా గుర్తు చప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం చేస్తూ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులకు పట్టుబ డి ఉన్న పరువు కాస్తా.. బజార్లో పడేసి.. కటకటాల పాలైన యువకుల చీకటి బాగోతం. వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి వసంతనగర్ హౌజ్ నెంబ రు 741, రోడ్ నెంబ రు 21లో ఖరీదైన అద్దె భవనంలో ఇద్దరు ఇంజనీరింగ్ యువకులు గంజాయి అమ్మకాలు చేపడుతున్నారనే సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం ఎస్ టి ఎఫ్ సీఐ నాగరాజు, ఎస్సై జ్యోతితోపాటు సిబ్బంది కలిసి ఇంట్లో సోదాలు నిర్వహించారు.
Hyderabad: మియాపూర్లో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు
Also Read
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
ఖరీదైన అద్దె భవనంలో ఖమ్మంకు చెందిన బేగం నిలేష్ కుమార్, వరంగల్ డొర్నకల్కు చెందిన సిరాజుల్లా నివాసముంటున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించినపుడు 1.185 కిలోల గంజాయి లభించింది. ఇద్దరు నిందితులను విచారించగా గత కొంత కాలంగా ఇన్స్ట్రా గ్రామ్లో కాకినాడ నుంచి గంజాయిని తెప్పిస్తూ అమ్మకాలు సాగిస్తున్నారని వెల్లడించారని సిఐ తెలిపారు. గంజాయిని కారులోను, బైకులోను తీసుకవచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. వీరివద్ద నుంచి రూ. 15 లక్షల కారు, రూ. మూడు లక్షల విలువ చేసే బైక్, రూ. 3 లక్షల విలువ మూడు ఐ ఫో న్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.25 వేలు. పట్టుబడిన వాహనాల ఖరీదు మాత్రం రూపాయలు 20 లక్షల పైనే ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు ఖమ్మంలోని ఇంజనీరింగ్ సమయములో స్నేహితులు. స్నేహితులుగా హైదారాబాద్ వచ్చి నివాసముంటున్నారు. నిలేష్ కుమార్ మోడల్ ఫోటోగ్రఫీ చేస్తు మరో పక్క గంజాయి అమ్మకాలు చేపడుతూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబ డ్డారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు. గంజాయిని పట్టుకున్న టీమ్లో కానిస్టేబుళ్లు రాజేష్, వికాష్, జయచంద్ర, కాశీలు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్ను అడిషనల్ ఎస్పీ భాస్కర్ అభినందించారు.
Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలోకి “కిమ్” ఆర్మీని దింపిన పుతిన్..
తాజావార్తలు
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!