Home
Bhatti Vikramarka
Bhatti Vikramarka News
-
CM Revanth Reddy : ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
CM Revanth Reddy : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, చేతల్లో చూపించింది. ఉద్యోగుల సుదీర్ఘకాల బకాయిలను కేవలం 100 రోజుల్లో రూ. 6,000 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఉద్యోగ జేఏసీ (JAC) నాయకులకు స్పష్టమైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని… -
Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా ఇప్పటికే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 8 వేల… -
Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
Cabinet Sub Committee : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న సార్వత్రిక జీవిత బీమా పథకంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ (IKJBP) అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడం కోసం రేపు (మంగళవారం) కేబినెట్ సబ్ కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరగబోయే ఈ కీలక మీటింగ్లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, అలాగే బీమా రంగానికి చెందిన భాగస్వామ్య సంస్థల… -
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
సంక్షేమ పథకాలు, ఆర్థిక స్వావలంబన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మహిళా సాధికారత, మూసీ పునరుజ్జీవంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతలను ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం మహాత్మాజ్యోతి రావు ఫూలే ప్రజాభవన్ లో జరిగిన 49వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ బ్యాంకర్ల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ దాన కిషోర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్… -
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని పేద ప్రజలకు మరియు రైతులకు ఎంతో మేలు చేకూర్చనుంది. సాధారణంగా సేకరించిన ధాన్యాన్ని మార్కెట్ వేలంలో విక్రయించడం కాకుండా, నేరుగా ప్రజలకే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ ధరకే పౌష్టికాహారాన్ని అందించాలనే ఉన్నత లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. దీనివల్ల మధ్యవర్తుల దందాకు అడ్డుకట్ట పడటమే కాకుండా, సామాన్యులకు నాణ్యమైన ఆహార ధాన్యాలు… -
Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
Bhatti Vikramarka : రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్లో విద్యుత్ సరఫరా పై ఇంధన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో భానుడి భగభగలకు తోడు ఇళ్లు,… -
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
Bhatti Vikramarka: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టమైన ఆదేశాల మేరకు, ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం రూ. 1000 కోట్ల నిధులను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ మేరకు నిధుల విడుదల చేయటం జరిగింది. ఈ మేరకు డిప్యూటీ సిఎం భట్టి… -
Bhatti Vikramarka :జూన్ 2 నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అక్షరజ్ఞానం , నాణ్యమైన విద్యపైనే ఆధారపడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని బోనకల్ , ఎర్రుపాలెం మండలాల్లో పర్యటించిన ఆయన, విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకురాబోతున్న విప్లవాత్మక మార్పుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పదేళ్ల పాలనలో రాష్ట్ర వనరులు విపరీతంగా దోపిడీకి గురికావడం వల్ల తెలంగాణ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేకపోయిందని విమర్శించారు. వనరుల దోపిడీని అరికట్టి, ఆ సంపదను… -
Congress Star Campaigners: ఎన్నికల కురుక్షేత్రం షురూ.. పుదుచ్చేరి టూ అస్సాం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే!
Congress Star Campaigners: 2026 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ తన ప్రచార వ్యూహాలకు పదును పెట్టింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం అధికారికంగా తన ‘స్టార్ క్యాంపెయినర్ల’ జాబితాను విడుదల చేసింది. ప్రతి రాష్ట్రానికి 40 మంది చొప్పున హేమాహేమీలను ప్రచార బరిలోకి దించుతోంది. READ ALSO: IPL All-Time Records: ఐపీఎల్లో చెక్కుచెదరని 10 ఆల్టైమ్ రికార్డులు.. ఈ సీజన్లో బ్రేక్ అయ్యేనా..? కేరళలో కాంగ్రెస్… -
Bhatti Vikramarka : ప్రజల పక్షాన నిలబడేదే ప్రజాస్వామ్యం.. బీఆర్ఎస్ తీరుపై భట్టి ఫైర్..
తెలంగాణ శాసనసభలో బడ్జెట్ క్లారిఫికేషన్ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలను, ఉద్యోగులను నిర్బంధించిన వారు.. ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వినే ఓపిక లేక సభ నుంచి వెళ్ళిపోవడం వారి అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. “గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న నాకు జరిగిన అవమానాలు రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయి. ప్రజల సమస్యల కోసం మైక్ అడిగితే ఇవ్వని వారు,…
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!