Today Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్కి ఈ వారం శుభారంభం లభించలేదు. ఇవాళ సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు.. సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. బెంచ్ మార్క్ విలువల కన్నా కింద క్లోజ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతుండటం వల్ల ఇంట్రాడేలో నష్టాలు మరింత పెరిగాయి. ఐటీ.. మెటల్.. మరియు కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిణ్ని ఎదుర్కొన్నాయి.
Today (31-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో ఇవాళ ట్రేడింగ్ మొత్తం అస్థిరంగానే సాగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 7 శాతంతో పోల్చితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతంగానే ఉంటుందని ఎకనమిక్ సర్వే-2023 పేర్కొనటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో 2 కీలక సూచీలు వరుసగా 2వ రోజు అంటే ఇవాళ కూడా బెంచ్ మార్క్లకు దిగువనే ముగిశాయి.
Today (30-01-23) Stock Market Roundup: రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల్లో భయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో వాటాల అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఫలితంగా ఈ వారం ప్రారంభం రోజైన ఇవాళ సోమవారం రెండు కీలక సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. బెంచ్ మార్క్ను దాటి పైకి రాలేకపోయాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ వెంటనే లాభాల్లోకి వచ్చాయి.