Today (30-01-23) Stock Market Roundup: బడ్జెట్ ముందు భయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (30-01-23) Stock Market Roundup: రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల్లో భయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో వాటాల అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఫలితంగా ఈ వారం ప్రారంభం రోజైన ఇవాళ సోమవారం రెండు కీలక సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. బెంచ్ మార్క్ను దాటి పైకి రాలేకపోయాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ వెంటనే లాభాల్లోకి వచ్చాయి.
Budget and Startups: కేంద్ర బడ్జెట్.. స్టార్టప్లకు ఏమిస్తుంది?
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 950 పాయింట్లు పెరిగింది. తర్వాత మళ్లీ నెగెటివ్ జోన్లోకి పడిపోయి 300 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 17 వేల 500 పాయింట్ల వద్ద టెస్టింగ్ ఎదుర్కొంది. చివరికి.. సెన్సెక్స్.. 169 పాయింట్లు పెరిగి 59 వేల 500 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ స్వల్పంగా 44 పాయింట్లు లాభపడి 17 వేల 648 పాయింట్ల వద్ద ముగిసింది.
బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సున్నా పాయింట్ 5 శాతం వరకు తగ్గాయి. సెక్టార్ల వారీగా చూస్తే.. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ బాగా రాణించింది. ఒక శాతం వరకు పెరిగి లాభ పడ్డ రంగాల్లో టాప్లో నిలిచింది. నిఫ్టీ ఆయిల్ మరియు గ్యా్స్ సూచీలు నాలుగు శాతం డౌన్ అయ్యాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. సెన్సెక్స్లో బజాజ్ ఫైనాన్స్ షేర్లు మంచి పనితీరు కనబరిచాయి.
డిసెంబర్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఈ సంస్థ స్టాక్స్ వ్యాల్యూ 5 శాతం వరకు పెరిగింది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలో 10 శాతం అప్పర్ కట్ స్థాయి నుంచి దిగొచ్చాయి. ఉదయం కేవలం 2 శాతమే పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర నామమాత్రం 43 రూపాయలు పెరిగింది.
అత్యధికంగా 56 వేల 900 రూపాయలు పలికింది. కేజీ వెండి రేటు 280 రూపాయలు లాభపడి గరిష్టంగా 68 వేల 609 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. క్రూడాయిల్ ధర పాతిక రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 481 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 5 పైసలు తగ్గింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 52 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!