T20 World Cup: మహ్మద్ యూనస్ చేసిన రాజకీయంతో బంగ్లాదేశ్ క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్(BCB) నిరాకరించింది. భద్రతా కారణాలను చూపుతూ, తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరింది. అయితే, ICC మాత్రం అందుకు నిరాకరించింది. దీంతో బీసీసీ టోర్నీని బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను తీసుకుంది.
తాత్కాలిక ప్రభుత్వ నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెట్కు ఆర్థికంగా కూడా భారీ దెబ్బగా మారే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే, బీసీబీకి ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయంలో సుమారు 325 కోట్ల బంగ్లాదేశీ టాకాలు (దాదాపు 27 మిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.