రెండు రోజుల పాటు సాగనున్న అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం చండీగఢ్లో ఆరంభమైంది. ఏఎఫ్ఐ అధ్యక్షుడిగా మాజీ షాట్పుట్ క్రీడాకారుడు, పద్మశ్రీ బహదూర్సింగ్ సాగూ ఎన్నికయ్యారు. ఆదిల్ సుమరివాలా స్థానంలో బహదూర్సింగ్ బాధ్యతలు చేపట్టారు. పోటీలో మరెవ్వరూ లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2029 వరకు ఏఎఫ్ఐ అధ్యక్షుడిగా కొనసాగుతారు. బహదూర్సింగ్ 2002 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచారు. 2000, 2004 ఒలింపిక్స్లోనూ ఆయన పాల్గొన్నారు. Also Read:…