ఈమధ్యకాలంలో సెల్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. దానికి తగ్గట్టుగా ప్రమాదాలు కూడా పెరిగాయనే చెప్పాలి. ఫోన్లకు చార్జింగ్ పెట్టి మాట్లాడడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నా నిర్లక్ష్యంగానే వుంటున్నారు చాలామంది యువత. సెల్ ఫోన్ ఛార్జింగ్ లో వుండగానే మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్ శివారులోని శంకరపల్లిలో ఓ యువకుడు మరణించిన సంఘటన విషాదాన్ని నింపింది. అసోంకు చెందిన 20 ఏళ్ళ భాస్కర్ జ్యోతినాథ్ రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఎలక్ట్రీషియన్గా…