Assam: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం గోలాఘాట్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. 27 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గోలాఘాట్ జిల్లాలోని దేర్గావ్ సమపంలోని బలిజన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ రాజేస్ సింగ్ తెలిపారు.