సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు...ప్రస్తుతం ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు.. భవిష్యత్తులో పెర్ఫార్మన్స్ ప్రకారం ర్యాంకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు సీఎం చంద్రబాబు. మంత్రుల పనితీరు మెరుగు పర్చుకోవాలనే ఉద్దేశం తో ర్యాంక్ లు ఇస్తున్నారా.. లేకపోతే.. మంత్రులు కొన్ని అంశాల్లో వెనక బడ్డారని చెప్పడానికి ర్యాంక్ లు ఇస్తున్నారా..?
టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు రేపు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తూన్నారు....75 మందిని ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు సమాచారం.. తాజా పరిణామాలు ఎమ్మెల్యేల పై వరస వివాదాల నేపథ్యంలో చంద్రబాబు ఈ సమావేశం లో ఏం చెప్తారు. ఎమ్మెల్యేలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారా..
కొంతమంది మంత్రులు.. ఎమ్మెల్యేల పనితీరు పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు..క్యాబినెట్ సమావేశంలో క్లాస్.తీసుకున్నారు... ఎమ్మెల్యేల పనితీరు మరకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు సీఎం చంద్రబాబు... ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి మంత్రులు. అధికారులు... వెంటనే దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు.
మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.. మంత్రులు ఏడాది కాలంలో మెరుగ్గా పనిచేశారు.. ఇక నుంచి పరిపాలనలో దూకుడు పెంచాలని సూచించారు.. తప్పుడు వార్తలు నిజం చేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోంది.. వైసీపీ నేతల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు..
కేబినెట్లో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు మంత్రుల తో ప్రస్తావించారు.. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందన్నారు సీఎం చంద్రబాబు. దర్యాప్తు ఆధారంగా అరెస్టులు ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, లిక్కర్ కేసు విషయంలో మంత్రులు ఆచి తూచి స్పందించాలన్నారు.
ఏపీ కేబినెట్ సమావేశంలో తన సింగపూర్ పర్యటనకు సంబంధించిన వివరాలను మంత్రులకు వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సింగపూర్ పర్యటన వివరాలు గురించి కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులకు చెప్పారు.. వైఎస్ జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి రానని చెప్పారు.. సీడ్ క్యాపిటల్ లో భాగస్వామ్యం కాబోం అన్నారు.. అక్కడకు వెళ్లి సింగపూర్ మంత్రులను ఆనాడు జగన్ ప్రభుత్వ పెద్దలు బెదిరించారు.. కేసులు పెడతాం అని భయపెట్టారు..
ఆంధ్రప్రదేశ్ మంత్రులు భయపడుతున్నారా? జగన్ పేరెత్తాలంటే జంకుతున్నారా? అధికార పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని ఆయన ఏ రేంజ్లో టార్గెట్ చేసినా… దీటైన కౌంటర్ వేయడానికి మంత్రులు వెనకాడుతున్నారా? ప్రతిపక్షాన్ని గట్టిగా టార్గెట్ చేయమని ముఖ్యమంత్రి ఓ వైపు ముల్లుగర్రతో పొడుస్తున్నా… ఎక్కువ మంది మినిస్టర్స్లో చలనం ఉండటం లేదా? ఎందుకలా జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 13 నెలలైంది. తొలి ఏడాది ఎలా గడిచిపోయినా…. ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ జనంలో తిరగడం…
ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మంత్రులు.. ఇక రోజులు లెక్కపెట్టుకోండి అని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై సరిగ్గా స్పందించకున్నా.. కార్యకర్త, నాయకులకు గౌరవం ఇవ్వకున్నా.. మీ ప్లేస్లో కొత్తవారు వస్తారని మంత్రులకు స్పష్టం చేశారు. ఇక నుంచి మీరు 1995 సీఎంను చూస్తారని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. నేడు సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో 12 అంశాలపై చర్చించారు. మంత్రులు ఎవరూ సంతృప్తికరంగా…
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మరీ... అందుకు సంబంధించిన దిశా నిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఈ నెల రెండు నుంచి మొదలైన కార్యక్రమాన్ని ఖచ్చితంగా నెల రోజుల పాటు సిన్సియర్గా నిర్వహించాలన్న ఆదేశాలున్నాయి పార్టీ పెద్దల నుంచి.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చి ఏడాది పూర్తయింది. దీంతో... ఈ టైంలో మనోళ్ళు ఏం చేశారు? నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? జనానికి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? ఘనకార్యాలు వెలగబెడుతున్నదెవరంటూ... ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుంటున్నారట సీఎం చంద్రబాబు. కేవలం రిపోర్ట్లు తీసుకోవడానికే పరిమితం అవకుండా... కాస్త తేడాగా అనిపించిన ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారట ఆయన.