TDP Key Meeting: నేడు టీడీపీ కీలక భేటీ.. పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
- నేడు ఉండవల్లిలో టీడీపీ కీలక సమావేశం..
- హాజరుకానున్న మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు..
- టీడీపీ సంస్థగత ఎన్నికలు, రాష్ట్ర కమిటీకి సంబంధించిన అంశాలపై చర్చ..
- మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
TDP Key Meeting: ఇవాళ ( ఆగస్టు 23న) ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ ముఖ్య నేతలు, పొలిట్బ్యూరో సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరగనుంది. త్వరలో టీడీపీ రాష్ట్ర కమిటీ పొలిట్ బ్యూరోలో మార్పులు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర కమిటీకి ముందు జిల్లా స్థాయి కమిటీలకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. ముగ్గురు సభ్యులతో జిల్లా కమిటీలు వేసే ఛాన్స్ ఉంది.
Read Also: US-India: టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్లో నూతన రాయబారి నియామకం
Also Read
- Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
- CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
- Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
- Venkata Krishnapuram Crime: లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.. వెంకటకృష్ణపాలెంలో విషాదంపై పుత్తూరు డీఎస్పీ!
అయితే, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల వైఖరిపై చర్చ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు వరస వివాదాల్లో ఇర్రుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అయ్యారు.. ఇవాళ జరిగే సమావేశంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వనున్నారు అని ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేల వైఖరి రిపీటెడ్ గా ఇలా ఉంటే.. ఇటు ప్రభుత్వం అటు పార్టీకి చెడ్డపేరు తెచ్చే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కీలక భేటీ నిర్వహించి నేతలకు సీఎం గట్టిగా చెప్పనున్నారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రులకు ఎమ్మెల్యేల బాధ్యత అప్పగించనున్నారు. ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే భవిషత్త్ లో ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు అలర్ట్ అయ్యారు.
Read Also: CM Chandrababu: నేడు పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన..
ఇక, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళుతున్నారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో అయినా ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని.. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ జనంలోకి వెళ్లేలా కీలకపాత్ర పోషించాలని నేటి సమావేశంలో చెప్పే అవకాశం ఉంది. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కూడా పార్టీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించే ఛాన్స్ ఉంది. జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పార్టీ కార్యాలయానికి వెళ్ళేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కూడా ఇవాళ్టి భేటీలో చెప్పనుమనట్టు టాక్. ఎందుకంటే పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తే కార్యకర్తలకి అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుందని సీఎం చంద్రబాబు నమ్ముతున్నారు.
తాజావార్తలు
-
USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
-
IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..
-
Easy Mango Lassi Recipe: క్షణాల్లో అదిరిపోయే మామిడి లస్సీ.. ఒక్క గ్లాస్తో ఆగరు అంతే..
-
Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
-
Soft Pink Lips Tips: మీ పెదాలు మృదువుగా.. గులాబీ రంగులో మెరిసిపోయే చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!