TDP Key Meeting: నేడు టీడీపీ కీలక భేటీ.. పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
- నేడు ఉండవల్లిలో టీడీపీ కీలక సమావేశం..
- హాజరుకానున్న మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు..
- టీడీపీ సంస్థగత ఎన్నికలు, రాష్ట్ర కమిటీకి సంబంధించిన అంశాలపై చర్చ..
- మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Key Meeting: ఇవాళ ( ఆగస్టు 23న) ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ ముఖ్య నేతలు, పొలిట్బ్యూరో సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరగనుంది. త్వరలో టీడీపీ రాష్ట్ర కమిటీ పొలిట్ బ్యూరోలో మార్పులు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర కమిటీకి ముందు జిల్లా స్థాయి కమిటీలకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. ముగ్గురు సభ్యులతో జిల్లా కమిటీలు వేసే ఛాన్స్ ఉంది.
Read Also: US-India: టారిఫ్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్లో నూతన రాయబారి నియామకం
Also Read
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
అయితే, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల వైఖరిపై చర్చ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు వరస వివాదాల్లో ఇర్రుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అయ్యారు.. ఇవాళ జరిగే సమావేశంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వనున్నారు అని ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేల వైఖరి రిపీటెడ్ గా ఇలా ఉంటే.. ఇటు ప్రభుత్వం అటు పార్టీకి చెడ్డపేరు తెచ్చే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కీలక భేటీ నిర్వహించి నేతలకు సీఎం గట్టిగా చెప్పనున్నారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రులకు ఎమ్మెల్యేల బాధ్యత అప్పగించనున్నారు. ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే భవిషత్త్ లో ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు అలర్ట్ అయ్యారు.
Read Also: CM Chandrababu: నేడు పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన..
ఇక, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళుతున్నారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో అయినా ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని.. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ జనంలోకి వెళ్లేలా కీలకపాత్ర పోషించాలని నేటి సమావేశంలో చెప్పే అవకాశం ఉంది. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కూడా పార్టీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించే ఛాన్స్ ఉంది. జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పార్టీ కార్యాలయానికి వెళ్ళేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కూడా ఇవాళ్టి భేటీలో చెప్పనుమనట్టు టాక్. ఎందుకంటే పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తే కార్యకర్తలకి అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుందని సీఎం చంద్రబాబు నమ్ముతున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?