మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చాలామంది బెర్త్ కోల్పోతే తానేటి వనితకు మాత్రం కొనసాగింపుతో పాటు ప్రమోషన్ లభించింది. ఓ మెట్టు పైకి ఎక్కారు. కీలకమైన హోంశాఖను దక్కించుకున్నారు. మొదటి కేబినెట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చిన సీఎం.. ఇప్పుడు తన మీద ఇంతటి బాధ్యత పెట్టినందుకు వనిత ఆనందపడ్డారు. కానీ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు వారాలు కూడా కాకుండానే వరస సంఘటనలు.. కామెంట్స్తో వివాదాలు ఇరుక్కుంటున్నారు. మహిళలపై వరస అఘాయిత్యాలతో పోలీస్ శాఖ గందరగోళంలో పడుతోంది.…
ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది. టీడీపీ సీనియర్ నేత వెంకన్న 100 మందితో సూసైడ్ బ్యాచ్ రెడీగా వుందన్న వ్యాఖ్యలపై మంత్రి జోగిరమేష్ స్పందించారు. బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటం చంద్రబాబు రక్తంలోనే వుంది. టీడీపీ మాపై పోటీ పడి గెలిచే అవకాశమే లేదు. మేం వాళ్ళని టచ్ చెయ్యనవపరం లేదు. జనమే ఓట్లతో సమాధానం చెప్పారు. చంద్రబాబే సూసైడ్…
మంత్రిగా మారాక ధర్మాన ప్రసాదరావు తన శాఖపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోసారి రెవిన్యూశాఖ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన. నిజాయితి గల పరిపాలన ప్రజలకు ఇవ్వాలన్నారు. త్వరితగతిన సేవలు అందించాలి. దీనికోసం వ్యక్తులు లేదా వ్యవస్థలను సంస్కరించాలన్నారు. ప్రజలనుండి రెవిన్యూ శాఖ పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, రెవిన్యూ శాఖని అన్నానంటే .నేను కూడా…
రాష్ట్రంలో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఒక్కర్ని బుజ్జగిస్తే.. మరో ఇద్దరు తెరపైకి వస్తున్నారు. తాజాగా ఈ పునర్వ్యస్థీకరణ రచ్చ.. అనంతపురం జిల్లాను కూడా తాకింది. నిన్నటి వరకు జిల్లాలో ఎలాంటి అలజడులు కనిపించ లేదు కానీ.. ఇప్పుడు ఏకంగా ఆవివాదం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బంద్ లకు కూడా దారి తీసింది. ఏపీలో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ వైసీపీకి పెద్ద తలనొప్పిలా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ అధికార పార్టీలోని అసంతృప్తులను బయటపెట్టింది.. కేబినెట్లో స్థానం కోల్పోయినవారిని, పదవి ఆశించి నిరాశ ఎదురై అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీ అధిష్టానం బుజ్జగించి.. మళ్లీ అందరినీ లైన్లోకి తీసుకొచ్చింది.. అయితే, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అలియాస్ ఆర్కే కూడా పదవి ఆశించారని.. మంత్రి పదవిరాకపోవడంతో అలకబూనారనే వార్తలు వచ్చాయి.. దీనిపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే ఆర్కే.. నేను మంత్రి పదవి ఆశించలేదని స్పష్టం చేసిన ఆయన.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో…
కేబినెట్లో చోటు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న శిల్పా చక్రపాణిరెడ్డికి ఎక్కడ తేడా కొట్టింది? ఆయనకు ప్రతికూలంగా మారిన పరిణామాలేంటి? శిల్పా అనుచరుల్లో ఏ అంశంపై చర్చ జరుగుతోంది? పొలిటికల్ సర్కిళ్లలో నడుస్తున్న వాదనేంటి? మంత్రి పదవి రాకుండా ఎక్కడ తేడా కొట్టింది? నంద్యాల జిల్లాలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని చివరి వరకు ప్రచారం జరిగింది. వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం.. అధికారంలో ఉన్న టీడీపీ నుంచి ఆరేళ్ల ఎమ్మెల్సీ…
ఏపీలో వరుస ఛార్జీల పెంపుదలతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బాదుడే బాదుడు పై వీడియో కాన్ఫరెన్సులో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం క్షేమం కోసం టీడీపీకీ అధికారం కావాలన్నారు చంద్రబాబు. టీడీపీకి అధికారం ఇప్పుడు చారిత్రిక అవసరం. రాష్ట్రం మిగిలి ఉండాలంటే.. టీడీపీ అధికారంలోకి రావాలి. https://ntvtelugu.com/pawan-kalyan-assurance-to-koulu-rythulu/ టీడీపీ గెలుపు అనేది కేవలం పార్టీ కోసమే కాదు….రాష్ట్రం కోసం అవసరం. మిగులు విద్యుత్తుగా ఉండే రాష్ట్రంలో ఈ స్థాయి కరెంట్ కష్టాలకు జగన్…
ఏపీలో ఇప్పుడంతా జగన్ కేబినెట్లో చోటు దక్కని అసంతృప్తి ఎమ్మెల్యేల గురించే హాట్ టాపిక్ అవుతోంది. పదవి రాలేదని అలిగిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని పిలిచి సీఎం జగన్, పార్టీ దూతలు మాట్లాడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడారు. కోటరీ వల్ల తనకు పదవి రాలేదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఎన్టీవీతో ఏ విషయాలైతే మాట్లాడానో.. ఆ విషయాలన్నీ సీఎంకు వివరించాను. https://ntvtelugu.com/yanamala-ramakrishnudu-sattires-on-jagan-cabinet/ పార్టీలో కోటరి చేస్తున్న పనుల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లాను.…
ఏపీలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. కేబినెట్ కూర్పుపై మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ది ఛాయ్, బిస్కెట్ కేబినెట్టేనంటూ యనమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్నది ఛాయ్, బిస్కెట్ కేబినెట్. గతంలో జగన్ ది పప్పెట్ కేబినెట్ అయితే.. ఇప్పుడు ఛాయ్ బిస్కెట్ కేబినెట్ అన్నారు యనమల. జగన్ కేబినెట్లో మంత్రులకు స్వేచ్ఛ లేదు. జగన్ కిచెన్ కేబినెట్టులోనో.. సలహాదారుల బృందంలో బీసీలు ఎందుకు లేరు..? నిర్ణయాలు తీసుకునే కోర్ కమిటీ..…
ఏపీలో అన్నివర్గాలకు కేబినెట్ విస్తరణలో న్యాయం చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనంతనం కీలక వ్యాఖ్యలు చేశారు శాసనసభాపతి తమ్మినేని సీతారాం. సీఎం జగన్ ఆదేశిస్తే పార్టీ కోసం పని చేస్తానంటూ స్పీకర్ తమ్మినేని అన్నారు. నాయకుడికి నేను సమస్య కాకూడదు. ఎక్కడ ఉండమంటే అక్కడుంటా. పార్టీకోసం పని చేయమంటే చేస్తానన్నారు. సహజంగానే ఆశావహులు ఉంటారు. ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యమం వచ్చింది. ఈ సామాజిక న్యాయ విప్లవం ముందు ప్రతిపక్షాలు…