AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ భేటీ.. దానిపైనే చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా సీఎం జగన్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయం మొదటి బ్లాక్ లో మధ్యాహ్నం 3గంటలకు సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్ శర్మ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తొలుత శుక్రవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా.. పలు కారణాల నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని గురువారం మధ్యాహ్నం 3గంటలకు ఏర్పాటు చేశారు అధికారులు. నూతన మంత్రి వర్గం తొలి సమావేశంలో సీఎం జగన్ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది.
దేవాదాయ శాఖలో 2 లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే ఇందులో దాదాపు లక్ష ఎకరాలు అర్చకుల ఆక్రమణలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దిశ చట్టంపై సవరణలకు సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్ లో మరోమారు నిర్ణయం తీసుకొని కేంద్రానికి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో పాటు.. ఆ జిల్లా పేరు మార్పుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
35 పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించిన 112 ఎకరాల భూ కేటాయింపుల పై చర్చించనున్న మంత్రి మండలి.. 2,211 కోట్ల పెట్టుబడులు,
2,443 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్న ప్రతిపాదిత పరిశ్రమలు.. అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.15,376 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన పంప్డ్ స్టోరేజ్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన పై చర్చ జరిగే అవకాశం. తిరుపతిలో నోవాటెల్ బ్రాండ్ కింద ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటు ప్రతిపాదన పై చర్చించే అవకాశం. కృష్ణా జిల్లా మల్లవల్లి ఫుడ్పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్ రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన పై క్యాబినెట్ చర్చించే అవకాశం.
తాజావార్తలు
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!