దసరా తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మావోలతో సహా నాలుగు కుంకీ ఏనుగులను పంపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు కర్ణాటక మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆరు కీలకమైన ఒప్పందాలు జరిగాయి..
చిత్తూరు, మన్యం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పంటపొలాల పై ఏనుగుల దాడి అంశాలు మా దృష్టికి మీడియా తీసుకొచ్చింది అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పంటపొలాల పై ఏనుగుల దాడి అంశంలో కర్ణాటక నుంచి సహాయం అందుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు.. రెండు రాష్ట్రాల మధ్య దేశంలోనే ఇలాంటి ఎంఓయూ గతంలో జరగలేదు పవన్ కల్యాణ్.. ఏపీ, కర్ణాటక మధ్య ఆరు అంశాలపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు..