BJP: లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘‘ఓట్ చోరీ’’ వాదనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అలంద్ నియోజకవర్గంతో ఉద్దేశపూర్వకంగా 6000 ఓట్లను తొలగించారని, దీని వెనక కేంద్ర ఎన్నికల సంఘం ఉందని, ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉపయోగించి ఓట్లను తొలగిస్తు్న్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్లను సామూహికంగా తొలగించారిన ఆరోపించారు. రాష్ట్రం వెలుపల నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లు ఉపయోగించి తొలగిస్తున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు.
Anil Vij: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చి హ్యట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుంటే, ఈ సారి ఎలాగైనా బీజేపీ అడ్డుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అందరి దృష్టి హర్యానా ఎన్నికలపై కేంద్రీకృతమైంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం బీజేపీ నేత, హర్యానా మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సున్నితంగా మందలించారు. కేంద్ర హోంశాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుదీర్ఘ ప్రసంగం చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు.