Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
Kolikapudi vs Kesineni Chinni: రేపు టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందుకు కొలికపూడి, కేశినేని.. ఏం జరగబోతోంది..?
Kolikapudi vs Kesineni Chinni: టీడీపీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతారు.. అయితే, తాజాగా, పార్టీలో కొందరు నేతల వ్యవహారం టీడీపీకి ఇబ్బందికి కరంగా మారింది.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారం.. టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు కు ఇబ్బందిగా మారింది.. అసలు వీళ్లకి టికెట్లు ఎందుకు ఇచ్చాను దేవుడా అనే పరిస్థితి వరకు వచ్చింది.. గత కొన్ని నెలలుగా కొలికపూడి వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు..… -
YS Jagan: రేపు మొంథా తుఫాన్ బాధిత ప్రాంతాలకు వైఎస్ జగన్..
YS Jagan: మొంథా తుపాను కృష్ణా జిల్లా రైతులను తీవ్రంగా దెబ్బతీసింది.. వరి సాగు చేస్తున్న రైతులపై తుఫాన్ ఎఫెక్ట్ భారీగా పడింది.. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో 1.54 లక్షల హెక్టార్లలో వరి, 24 వేల హెక్టార్లలో వివిధ రకాల ఉద్యాన పంటలను రైతులు సాగు చేశారు. వరి సాగుకు రైతులు ఎకరాకు 25 వేల నుంచి 30 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం వరి పొలాలు పొట్ట… -
Minister Nara Lokesh: గూగుల్ ఏపీకి తీసుకెళ్లారు ఎలా సాధ్యం..? ఏదో మ్యాజిక్ జరుగుతోంది అంటున్నారు..!
Minister Nara Lokesh: ప్రభుత్వం.. ప్రజలు కలిస్తేనే… సీఐఐ సదస్సు అన్నారు మంత్రి నారా లోకేష్.. నిన్న మహిళా క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ముంబై వెళ్లిన ఆయన.. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా చాలా మంది పారిశ్రామిక వేత్తలను కలిశాను. ఏపీలో ఏదో మ్యాజిక్ జరుగుతోంది అంటున్నారు.. గూగుల్ ఏపీకి తీసుకెళ్లారు..? ఎలా సాధ్యం..? అని అడిగారని తెలిపారు.. మా హయాంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు… -
Rain Forecast in Andhra Pradesh: ఏపీలో మరోసారి భారీ వర్షాలు..!
Rain Forecast in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించింది.. ఏపీలో జరిగిన నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తూ.. ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, మొంథా తుఫాన్ నుంచి తేరుకోక ముందే.. మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరశాఖ పేర్కొంది.. ఏపీలో మరోసారి వర్షాలు ఉధృతం కానున్నాయి. ఈనెల 5వ తేదీ నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో ప్రభావం పెరుగుతుంది. దీనికి స్థానిక వాతావరణ పరిస్థితులు కారణమని నిపుణులు అంచనా… -
Minister Kondapalli Srinivas: ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక వసతుల కల్పనపై ఫోకస్..
Minister Kondapalli Srinivas: ఎంఎస్ఎంఈల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేయనుంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులలో మౌలిక వసతుల కల్పన త్వరితగతిన చేపట్టాలని, వీలైనంత త్వరగా నీరు, రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్… -
Minister Nara Lokesh: 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలు లక్ష్యం.. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి..
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నారు మంత్రి నారా లోకేష్.. వైజాగ్లో త్వరలో సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం.. పెట్టుబడులే ప్రధాన అజెండాగా ఈ సదస్సు జరుగుతుంది.. సీఐఐ సదస్సుల్లో 48 సెషన్స్ జరుగుతాయి.. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి.. 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఏపీకి పెట్టుబడుల వెల్లువ సాధ్యమవుతోందన్నారు లోకేష్.. 16 నెలల్లో రూ.10లక్షల కోట్ల… -
Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
కార్తీక మాసం రద్దీ.. ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. వివిధ ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టింది.. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. క్యూ లైన్ల… -
Vizag Crime: 6 నెలల గర్భవతి, భర్త అనుమానాస్పద మృతి..!
Vizag Crime: విశాఖపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది.. గర్భవతి అయిన భార్య.. ఆమె భర్త ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనం సృష్టించింది.. పెళ్లయి 6 నెలలు కూడా నిండకుండానే నవ దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సంచలనంగా మారింది. నిండు చూలాలు 6 నెలల గర్బవతి మరి కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మ నిచ్చే భార్య విగత జీవిగా మారింది.. ఈ విషాద ఘటన విశాఖలోని 4th టౌన్ పోలీస్ స్టేషన్… -
Deputy CM Pawan Kalyan: ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్.. ఫ్లెమింగోల శాశ్వత స్థావరంగా తీర్చిదిద్దుతాం..
Deputy CM Pawan Kalyan: ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్.. ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పులికాట్ సరస్సుకు శీతాకాలపు అతిథుల రాక మొదలైంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి సైబీరియా నుంచి వచ్చి చేరిన ఫ్లెమింగోలు.. మన అందరికీ కనువిందు చేయడానికి సిద్ధమయ్యాయి. ఆహారం, విశ్రాంతి కోసం వచ్చే ఆరు నెలలపాటు పులికాట్ పరిసరాల్లోనే నివసిస్తాయి. అందుకే ప్రతి ఏడాది ఈ నీటి పక్షుల రాకను… -
Sajjala Ramakrishna Reddy: సర్కార్పై సజ్జల ఫైర్.. ప్రభుత్వానికి అర్థమే మారిపోయింది..!
Sajjala Ramakrishna Reddy: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి అర్థమే మారిపోయింది అని ఆరోపించారు వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రజల ఆకాంక్షల మేరకు ఏ ప్రభుత్వాలు అయినా పనిచేస్తాయి.. మానిఫెస్టోలు అమలు చేయటంతో పాటు వ్యవస్థలకు అనుగుణంగా పనిచేయాలి.. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం వ్యవస్థలను గాలికి వదిలేసింది.. ప్రభుత్వమే నేరస్వభావం కలిగి ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు…
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!