PM Modi AP Tour: ఏపీ పర్యటనపై ప్రధాని మోడీ ట్వీట్.. రేపు నేను ఏపీలో ఉంటా..
- రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ప్రధాని మోడీ..
- తన ఏపీ టూర్ పై ట్వీట్ చేసిన నరేంద్ర మోడీ..
- రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను..
- శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రార్థనలు చేస్తా..
- కర్నూలులో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi AP Tour: మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇప్పటికే ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం.. ప్రధాని కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు.. అయితే, తన ఏపీ పర్యటనపై ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ.. ‘రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను.. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను.. ఆ తర్వాత, కర్నూలులో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవి.’ అంటూ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ..
కాగా, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో.. శ్రీశైలంతో పాటు.. కర్నూలు జిల్లాల్లోనూ పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. ఇక, ప్రధాని మోడీ ఏపీ టూర్ షెడ్యూల్ను పరిశీలిస్తే.. ..
* 16న ఉదయం 7.50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న ప్రధాని మోడీ
* 10.20కి కర్నూలు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు..
* 10.25కి ప్రత్యేక హెలికాఫ్టర్లో సున్నిపెంటకు బయల్దేరతారు..
* 11.10కి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు..
* 11.45కి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోన్న మోడీ..
* దర్శనం అనంతరం మధ్యాహ్నం 12.45కి భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరుకుంటారు..
* మధ్యాహ్నం 1.25కి శ్రీశైలం నుంచి సున్నిపెంటకు బయల్దేరతారు..
* మధ్యాహ్నం 1.40కి సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్కు చేరుకుంటారు..
* 2.30 రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్కు చేరుకోనున్న ప్రధాని మోడీ..
* 2.30 తర్వాత శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న మోడీ..
* సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ..
* 4.15 కి రోడ్డు మార్గంలో నన్నూరు హెలిప్యాడ్కు చేరుకుంటారు..
* నన్నూరు హెలిప్యాడ్ నుంచి 4.40కి కర్నూలు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు
* సాయంత్రం 4.40 తర్వాత కర్నూలు నుంచి బయల్దేరి రాత్రి 7.15కి ఢిల్లీ చేరుకోనున్న ప్రధాని మోడీ..
Also Read
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలు లో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.ఈ పనులు విద్యుత్,…
— Narendra Modi (@narendramodi) October 15, 2025
తాజావార్తలు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
-
Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!