Madanapalle Incident: మదనపల్లి ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madanapalle Incident: మదనపల్లిలో జరిగిన దారుణ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొంటూ, బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించి ముందుగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేశారని అనిత తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో ముద్దాయి డ్రగ్స్ లేదా గంజాయి సేవించలేదని, అయితే మితిమీరిన మద్యం సేవించినట్లు గుర్తించామని వెల్లడించారు. మొదట బాలిక అదృశ్యమై ఉండవచ్చని అనుకున్నామని, కానీ స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టి బాలిక మృతదేహాన్ని ఆమె ఇంటి ఎదురుగా గుర్తించారని తెలిపారు.
నిందితుడిని తమకు అప్పగించాలని స్థానికులు ఆందోళనకు దిగారని హోంమంత్రి చెప్పారు. అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉండటంతో, విచారణకు ఆటంకం కలగకుండా బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకి, నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అతడు బెయిల్పై బయటకు రాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇటువంటి ఘటనలపై తమ ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తోందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
Also Read
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
- Ambati Rambabu: రావణ్పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు
కాగా, మదనపల్లిలో చిన్నారి హత్య కేసు ఉద్రిక్తతకు దారి తీసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తీసుకెళ్లేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను స్థానికులు అడ్డుకుంటూ ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్పీ సహా ఇతర పోలీసు అధికారులు స్థానికులతో చర్చలు జరిపారు.. ఆందోళన కారణంగా చెన్నై–ముంబై జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని కచ్చితంగా కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేస్తామంటూ కడప ఎస్పీ విశ్వనాధ్ స్థానికులకు వివరించే ప్రయత్నం చేస్తున్న స్థానికులు ఆందోళన విరమించక పోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తాజావార్తలు
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
-
TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్కు తిప్పలు
-
Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
-
Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!