లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్, సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘మౌనమ్’. పవర్ ఆఫ్ సైలెన్స్ అన్నది ట్యాగ్ లైన్. ‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళీ, ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మణిరత్నం ‘మౌనరాగం’ తరహాలో రూపుదిద్దుకున్న…