‘మౌనమ్’గా విడుదలైన ప్రచార చిత్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్, సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘మౌనమ్’. పవర్ ఆఫ్ సైలెన్స్ అన్నది ట్యాగ్ లైన్. ‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళీ, ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మణిరత్నం ‘మౌనరాగం’ తరహాలో రూపుదిద్దుకున్న ‘మౌనమ్’ మంచి విజయం సాధించాల’ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, ఊర్వశీ ఓటీటీ సీఈఓ రామ్ తుమ్మలపల్లి కూడా పాల్గొన్నారు. ‘మౌనం కూడా కొన్ని సందర్భాలలో ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశామని, ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ ప్రథమార్ధంలో సినిమాను విడుదల చేస్తామ’ని నిర్మాతలు తెలిపారు. ఐశ్వర్య అడ్డాల, ‘శివ’ ఫేమ్ చిన్నా, జీవా, ధనరాజ్, శేషు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, ఎడిటింగ్: శివ శర్వాణి, ఛాయాగ్రహణం-దర్శకత్వం: కిషన్ సాగర్.
Also Read
తాజావార్తలు
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
-
OTR: వైజాగ్ పాలిటిక్స్లో తన ముద్ర కోసం శ్రీభరత్ తిప్పలు.?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!