Air India: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరడంతో, ఎయిర్ ఇండియా తన మధ్యప్రాచ్య సర్వీసులన్నింటినీ తక్షణమే నిలిపివేసింది. ముఖ్యంగా దుబాయ్, దోహా, రియాద్, టెల్ అవీవ్ వంటి నగరాలకు వెళ్లే విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించింది.…