African Union Chairperson: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ20 సమావేశాన్ని నిర్వహించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు ఈ రోజు ముగిశాయి. అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, చైనా ప్రీమియర్ లీ కియాంగ్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా వంటి పలువురు దేశాధినేతుల, ఇతర సంస్థల అధికారులు న్యూఢిల్లీకి వచ్చారు. భారత్ వారందరూ ఫిదా అయ్యేలా ఆతిథ్యం ఇచ్చింది.