Global Terrorism Index 2025: పాకిస్తాన్ మరోసారి తనకు ‘‘టెర్రరిజం’’లో తిరుగు లేదని నిరూపించుకుంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్(GTI) -2025లో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో ఉండగా, మూడో స్థానంలో సిరియా ఉంది. పాక్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా అవతరించింది. ఉగ్రవాద దాడుల్లో భారీ పెరుగుదల, పౌరుల మరణాల సంఖ్య పెరగడం వలన పాక్ రెండో స్థానానికి చేరుకుంది.
Donald Trump: ఆఫ్ఘనిస్థాన్ నుంచి బయటకు వచ్చిన అమెరికా, మరోసారి ఆ దేశానికి వెళ్లాలని యోచిస్తోంది. ‘‘జో బైడెన్ వదులుకున్నాడు, మనం దానిని తిరిగి పొందాలని నేను అనుకుంటున్నారు’’ అని ట్రంప్ అన్నారు. అమెరికా వ్యూహాత్మకంగా భావిస్తున్న ఆఫ్ఘాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరం గురించి ట్రంప్ మాట్లాడారు. అమెరికా సాయుధ దళాల కమాండర్ అండ్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశం తర్వాత, ఆయన విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నన్ను…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. వర్షం కారణంగా ఆట రద్దైంది. 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 12.5 ఓవరల్లో ఒక వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసింది. అయితే వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.
India On Pak: ఇటీవల తాలిబన్లు టార్గెట్గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లోని ఆప్ఘన్ పక్తికా ప్రావిన్సుపై ఈ దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులో పిల్లలు ,మహిళలు అమాయకులు 40 మందికి పైగా మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు చెప్పారు. ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు.
ఇటీవల ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 46 మంది మరణించగా.. మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలు ఉన్నారని.. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అఫ్గానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించారు. ఈ దాడి తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఇరువైపుల సైన్యాలు పరస్పరం సరిహద్దుల్లోకి ప్రవేశించి ప్రజలను చంపేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కొత్త యుద్ధం వచ్చే…
Taliban: ఇఅఫ్గానిస్థాన్లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. అక్కడి మహిళల హక్కులను క్రమంగా కాలరాస్తున్నారు. తాజాగా ఆ దేశ పాలకులు తీసుకు వచ్చిన డిక్రీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
Taliban: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పాకిస్తాన్ తన భూభాగాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో తాలిబన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా తాలిబన్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఆర్మీ ఔట్పోస్టులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్లోని కుర్రం, ఉత్తర వజీరిస్తాన్లోని గిరిజన జిల్లాలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. ప్రాణనష్టంపై ఖచ్చితమైన సమచారం లేనప్పటికీ, రెండు వైపుల భారీగా ఆయుధాలను మోహరించినట్లు తెలుస్తోంది.
Pakistan: 2011లో అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. మన పెరట్లో పాముల్ని పెంచుకుని, అవి పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించడం అవివేకం అవుతుందని పాకిస్తాన్ని ఉద్దేశించి అన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిన పాకిస్తాన్ ఎదుర్కొంటోంది.
Pakistan Air Strikes: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు సరిహద్దు ప్రావిన్స్లో జరిపిన దాడుల్లో 46 మంది మరణించారని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి బుధవారం తెలిపారు.