Taliban: రైలు హైజాక్తో మాకు సంబంధం లేదు.. పాక్ ఆరోపణలపై తాలిబన్లు..
- పాక్ రైలు హైజాక్తో మాకు సంబంధం లేదు..
- పాక్ వాదనల్ని తోసిపుచ్చిన తాలిబన్లు..
Taliban: బలూచిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో ఆఫ్ఘనినిస్తాన్కి చెందిన ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే, పాకిస్తాన్ వాదనల్ని తాలిబన్లు తోసిపుచ్చారు. ‘‘బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ప్యాసింజర్ రైలుపై జరిగిన దాడిని ఆఫ్ఘనిస్తాన్తో ముడిపెడుతూ పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చేసిన నిరాధారమైన ఆరోపణలను మేము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాము. ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలకు బదులుగా వారి స్వంత భద్రత , అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలని పాకిస్తాన్ వైపును కోరుతున్నాము’’ అని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ ఖహార్ బాల్కీ అన్నారు.
Read Also: Starlink Link India: భారత్లో స్టార్ లింక్ సేవలు.. విజయం అంత ఈజీ కాదుగా!
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
మంగళవారం, బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్కి వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ని బలూచిస్తాన్ లిబరేషర్ఆర్మీ(బీఎల్ఏ) హైక్ చేసింది. 450 మంది ప్రయాణికుల్లో వందలాది మందిని బీఎల్ఏ బందీలుగా పట్టుకుంది. అయితే, దాడి చేసిన వారికి, ఆఫ్ఘనిస్థాన్లో ఉన్న ఉగ్రవాద నాయకులు సహాయం చేశారని, ఆ దేశంలోని ఉగ్రవాద నాయకులు ఈ దాడికి కుట్ర పన్నారని పాకిస్తాన్ ఆరోపించడంపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, బలూచ్ తిరుగుబాటుదారులు హైజాక్ చేసిన రైలు నుంచి బందీలను రక్షించే ఆపరేషన్ పూర్తయినట్లు పాక్ భద్రతా బలగాలు చెప్పాయి. ఈ హైజాక్లో పాల్గొన్న 33 మంది ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు పాక్ ఆర్మీ ప్రతినిధి బుధవారం ప్రకటించారు. ఈ ఆపరేషన్లో 21 మంది ప్రయాణికులు, నలుగురు సైనికులు చనిపోయినట్లు వెల్లడించారు. మరోవైపు, తమ బందీల్లో 100 మంది వరకు చనిపోయినట్లు బీఎల్ఏ చెబుతోంది. బీఎల్ఏ పాక్ ఆర్మీ వాదనల్ని తోసిపుచ్చింది. పోరాటం ఇంకా కొనసాగుతోందని, పాకిస్తాన్ దళాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయని చెప్పింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!