Taliban: రైలు హైజాక్తో మాకు సంబంధం లేదు.. పాక్ ఆరోపణలపై తాలిబన్లు..
- పాక్ రైలు హైజాక్తో మాకు సంబంధం లేదు..
- పాక్ వాదనల్ని తోసిపుచ్చిన తాలిబన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban: బలూచిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో ఆఫ్ఘనినిస్తాన్కి చెందిన ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే, పాకిస్తాన్ వాదనల్ని తాలిబన్లు తోసిపుచ్చారు. ‘‘బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ప్యాసింజర్ రైలుపై జరిగిన దాడిని ఆఫ్ఘనిస్తాన్తో ముడిపెడుతూ పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చేసిన నిరాధారమైన ఆరోపణలను మేము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాము. ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలకు బదులుగా వారి స్వంత భద్రత , అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలని పాకిస్తాన్ వైపును కోరుతున్నాము’’ అని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ ఖహార్ బాల్కీ అన్నారు.
Read Also: Starlink Link India: భారత్లో స్టార్ లింక్ సేవలు.. విజయం అంత ఈజీ కాదుగా!
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
మంగళవారం, బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్కి వెళ్తున్న జఫర్ ఎక్స్ప్రెస్ని బలూచిస్తాన్ లిబరేషర్ఆర్మీ(బీఎల్ఏ) హైక్ చేసింది. 450 మంది ప్రయాణికుల్లో వందలాది మందిని బీఎల్ఏ బందీలుగా పట్టుకుంది. అయితే, దాడి చేసిన వారికి, ఆఫ్ఘనిస్థాన్లో ఉన్న ఉగ్రవాద నాయకులు సహాయం చేశారని, ఆ దేశంలోని ఉగ్రవాద నాయకులు ఈ దాడికి కుట్ర పన్నారని పాకిస్తాన్ ఆరోపించడంపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, బలూచ్ తిరుగుబాటుదారులు హైజాక్ చేసిన రైలు నుంచి బందీలను రక్షించే ఆపరేషన్ పూర్తయినట్లు పాక్ భద్రతా బలగాలు చెప్పాయి. ఈ హైజాక్లో పాల్గొన్న 33 మంది ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు పాక్ ఆర్మీ ప్రతినిధి బుధవారం ప్రకటించారు. ఈ ఆపరేషన్లో 21 మంది ప్రయాణికులు, నలుగురు సైనికులు చనిపోయినట్లు వెల్లడించారు. మరోవైపు, తమ బందీల్లో 100 మంది వరకు చనిపోయినట్లు బీఎల్ఏ చెబుతోంది. బీఎల్ఏ పాక్ ఆర్మీ వాదనల్ని తోసిపుచ్చింది. పోరాటం ఇంకా కొనసాగుతోందని, పాకిస్తాన్ దళాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయని చెప్పింది.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!