Adulterated Milk Tragedy: రాజమండ్రిలో కల్తీ పాలు ఘటన తీవ్ర విషాదానికి దారితీసింది. చౌడేశ్వరి నగర్కు చెందిన అనంతలక్ష్మి (72) అనే మహిళ శనివారం మృతి చెందడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. కల్తీ పాలు సేవించిన కారణంగా అనారోగ్యం పాలైన మరో పదిమంది ప్రస్తుతం రాజమండ్రిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురు తీవ్ర స్థితిలో ఉండగా వెంటిలేటర్పై డయాలసిస్ చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురికి డయాలసిస్ కొనసాగుతోంది. India Playing…
Rajahmundry Adulterated Milk: రాజమండ్రిలో కల్తీపాల వల్ల మంచాన పడ్డవాళ్లు ఇంకా కోలుకోవటం లేదు. రోజుకొకరుగా చనిపోతూ ఉండటం అక్కడి ప్రజలను ఆందోళన కలిగిస్తుంది. ఇంతవరకు ఏడుగురు చనిపోగా.. మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి డయాలసిస్ నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో కల్తిపాల ఘటన వెలుగు చూసి 10 రోజులు అయింది. కానీ ఇప్పటికీ ఆ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు బాధితుల పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉద్యోగుల…
Adulterated Milk Deaths: రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా మరణాలపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొత్తం 106 కుటుంబాలకు పాలు విక్రయించారు.. వారిలో 12 మంది కిడ్నీ సమస్యల బారిన పడ్డారు.. నలుగురు మృతి చెందారు అని తెలిపింది.