ప్రముఖ నటుడు మంచు మనోజ్ హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఆస్పత్రిలో చేరారు. జల్పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దుండగులు దాడి చేసినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం భార్యతో కలిసి మంచు మనోజ్ వచ్చినట్లు తెలిసింది. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు మనోజ్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.